Political News

దానం నాగేందర్ కు షాక్ తప్పదా ?

అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. కొన్ని చోట్ల సిట్టింగుల వైపే మొగ్గు చూపుతున్న పార్టీ అధినేత కేసీఆర్ మరికొన్ని చోట్ల మాత్రం వారికి ఝలక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇటీవలే పార్టీ మీటింగులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారని వారిని సహించేది లేదని కేసీఆర్ తేల్చేశారు. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ దక్కదని హెచ్చరించారు.

కేసీఆర్ పునరాలోచనలో ఉన్న నియోజకవర్గాల్లో హైదరాబాద్ సిటీలోని ఖైరతాబాద్ కూడా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖైరతాబాద్ అభివృద్ధిపై నాగేందర్ అసలు దృష్టి పెట్టలేదని కేసీఆర్ కు రిపోర్టులు అందాయట. పండుగలకు, పబ్బాలకు వచ్చి జెండాలు ఎగురవేయడం, స్వీట్స్ పంచడం, స్లమ్స్ లో జనానికి కాసిని డబ్బులు పంచడం మినహా మౌలిక సదుపాయుల అభివృద్దికి, ఇతర పనులపై నాగేందర్ ఎలాంటి చొరవ తీసుకోలేదని అంటున్నారు

గత ఎన్నికల్లో ఖైరతాబాద్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి తర్వాతి కాలంలో బీజేపీ చేరి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న దాసోజు శ్రవణ్ కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. దాసోజు శ్రవణ్ మంచి వక్తే కాకుండా ఖైరతాబాద్ సమస్యలు, వాటి పరిష్కారాలు కూడా ఆయనకు తెలుసని కేసీఆర్ కు నివేదికలు అందడంతో గులాబీ బాస్ ఆయన వైపు దృష్టి పెట్టారు.

నిజానికి శ్రవణ్ కు తొలుత ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నారు. అయితే తర్వాత మనసు మార్చుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకుంటున్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శ్రవణ్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే దానం నాగేందర్ కు కష్టకాలం తప్పకపోవచ్చు…

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

24 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago