ఆంధ్రుల అభిమాన అన్న, యువగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. ఏడాది పొడవునా వంద సభలు నిర్వహించిన టీడీపీ, ఎన్టీఆర్ కుటుంబం కలిసి నిర్ణయించారు. ఇటీవలే ఒక సభకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమాలన్నింటినీ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు.
కట్ చేసి చూస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కాబోతోంది. రూ.4.5 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ విగ్రహాన్ని మే 28న ఆవిష్కరిస్తారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. దానితో తాను తప్పకుండా వస్తానని జూనియర్ హామీ ఇచ్చారు..
ఈ నేపథ్యంలోనే ఎన్టీయార్ ఫ్యామిలీలో పెద్దలను పిలవకుండా జూనియర్ను ఎందుకు పిలిచారన్న చర్చ మొదలైంది.అయితే 28 వరకు టైమ్ ఉందని అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్లి అందరినీ పిలుస్తామని తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. చూడాలి మరి ఏమవుతుందో…
This post was last modified on May 2, 2023 10:39 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…