కరోనా పుణ్యమా అని యావత్ ప్రపంచం మొత్తం సరికొత్త పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరూ సంతోషంగా లేని పరిస్థితి. కడుపు నిండా పట్టెడన్నం లేక పేదోడి వేదన చెందుతుంటే.. తినేందుకు.. ఉండేందుకు చచ్చేంత ఉన్నా.. కరోనా భయం సంపన్నుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏకకాలంలో రాజు.. పేద అన్న తేడా లేకుండా అందరిని వణికిస్తున్న క్రెడిట్ మాత్రం కరోనాకే చెల్లుతుంది.
విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ వేళ.. అందరిలోనూ కరోనా భయంతో పాటు.. దాని కారణంగా చోటు చేసుకుంటున్న సామాజిక మార్పుల్లో తమ మీద పడే ప్రభావం ఎంతన్న లెక్కల్లో ప్రతి ఒక్కరూ మునిగిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దుబాయ్ లోని ఒక భారతీయుడికి అదృష్టం వరించింది. అతగాడి సుడి తిరిగిపోయేలా లాటరీ తగిలింది.
సంక్షోభంలో అతగాడి అదృష్టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ లోని ఎమిరేట్స్ లోటో ప్రారంభోత్సవ డ్రాలో ఒక భారతీయుడు విజేతగా నిలిచారు. మన రూపాయిల్లో చూస్తే రూ.73 లక్షల భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా గెలుచుకున్నారు. తన దగ్గరున్న టికెట్లోని ఆరు నెంబర్లు కలవటంతో తాను షాక్ తిన్నట్లుగా మహమ్మద్ ఖలీద్ చెబుతున్నారు.
దుబాయ్ లో టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ గా పని చేస్తున్న అతగాడు పదేళ్ల క్రితం భారత్ నుంచి దుబాయ్ వెళ్లారు. తాజాగా అతడికి లాటరీ వరింటంతో భారీ ప్రైజ్ మనీతో పాటు.. కరోనా వేళ మహా సుడిగాడన్న పేరును సొంతం చేసుకున్నాడు. తనకొచ్చిన లాటరీ మొత్తాన్ని తన కుటుంబానికి పంచటంతో పాటు.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్.. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు 10 మిలియన్ రమదాన్ మీల్స్ కార్యక్రమానికి తన వంతు సాయాన్ని అందిస్తానని చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
This post was last modified on April 23, 2020 11:03 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…