కరోనా పుణ్యమా అని యావత్ ప్రపంచం మొత్తం సరికొత్త పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరూ సంతోషంగా లేని పరిస్థితి. కడుపు నిండా పట్టెడన్నం లేక పేదోడి వేదన చెందుతుంటే.. తినేందుకు.. ఉండేందుకు చచ్చేంత ఉన్నా.. కరోనా భయం సంపన్నుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏకకాలంలో రాజు.. పేద అన్న తేడా లేకుండా అందరిని వణికిస్తున్న క్రెడిట్ మాత్రం కరోనాకే చెల్లుతుంది.
విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ వేళ.. అందరిలోనూ కరోనా భయంతో పాటు.. దాని కారణంగా చోటు చేసుకుంటున్న సామాజిక మార్పుల్లో తమ మీద పడే ప్రభావం ఎంతన్న లెక్కల్లో ప్రతి ఒక్కరూ మునిగిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దుబాయ్ లోని ఒక భారతీయుడికి అదృష్టం వరించింది. అతగాడి సుడి తిరిగిపోయేలా లాటరీ తగిలింది.
సంక్షోభంలో అతగాడి అదృష్టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ లోని ఎమిరేట్స్ లోటో ప్రారంభోత్సవ డ్రాలో ఒక భారతీయుడు విజేతగా నిలిచారు. మన రూపాయిల్లో చూస్తే రూ.73 లక్షల భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా గెలుచుకున్నారు. తన దగ్గరున్న టికెట్లోని ఆరు నెంబర్లు కలవటంతో తాను షాక్ తిన్నట్లుగా మహమ్మద్ ఖలీద్ చెబుతున్నారు.
దుబాయ్ లో టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ గా పని చేస్తున్న అతగాడు పదేళ్ల క్రితం భారత్ నుంచి దుబాయ్ వెళ్లారు. తాజాగా అతడికి లాటరీ వరింటంతో భారీ ప్రైజ్ మనీతో పాటు.. కరోనా వేళ మహా సుడిగాడన్న పేరును సొంతం చేసుకున్నాడు. తనకొచ్చిన లాటరీ మొత్తాన్ని తన కుటుంబానికి పంచటంతో పాటు.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్.. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు 10 మిలియన్ రమదాన్ మీల్స్ కార్యక్రమానికి తన వంతు సాయాన్ని అందిస్తానని చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
This post was last modified on April 23, 2020 11:03 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…