Political News

శైలజ టీడీపీలో చేరబోతున్నారా ?

పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా ? కాంగ్రెస్ కు రాజీనామా చేసి తొందరలోనే తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? పార్టీ సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి బుధవారం సాకే ఇంటికి వెళ్ళారు. వీళ్ళభేటీలో సాకేను టీడీపీలో చేరమని జేసీ ఆహ్వానించినట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో పార్టీ బలమైన అభ్యర్ధికోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే పీసీసీ అధ్యక్షుడిగాను అంతకుముందు మంత్రిగా కూడా పనిచేసిన శైలజానాధ్ ను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైనట్లు ప్రచారం మొదలైంది.

శైలజానాధ్ అయితే పార్టీ తరపున అన్నీ విధాలుగా గట్టి అభ్యర్ధి అవుతారని జేసీ ఇప్పటికే చంద్రబాబునాయుడుతో చెప్పారట. ఇపుడు నియోజకవర్గంలో చాలా గ్రూపులున్నాయి. వీటిల్లో ఏ ఒక్క గ్రూపుకు మరో గ్రూపుతో పడటంలేదు. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన బండారు శ్రావణి మీద వైసీపీ తరపున పోటీచేసిన జొన్నలగడ్డ పద్మావతి గెలిచారు. గెలిచిన పద్మావతి, ఓడిన బండారు ఇద్దరు నియోజకవర్గంలో యాక్టివ్ గానే తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో శ్రావణి రెగ్యులర్ గా పాల్గొనటమే కాకుండా క్యాడర్ తో కూడా టచ్ లో ఉంటున్నారు.

అయితే శ్రావణి భర్త డామినేషన్ కారణంగానే నియోజకవర్గంలో కొందరు నేతలతో గొడవలవుతున్నాయట. అందుకనే శ్రావణికి వ్యతిరేకంగా మూడు గ్రూపులు తయారయ్యాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరికి వారుగా తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే శ్రావణి మీద కూడా పార్టీలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది.

ఈ గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఎవరో ఒకళ్ళకి టికెటిచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని అర్ధమైపోయింది. అందుకనే బలమైన అభ్యర్ధికోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే జేసీ హఠాత్తుగా శైలజ ఇంటికి వెళ్ళింది. సాకేకు కూడా కాంగ్రెస్ లో ఇక భవిష్యత్తు లేదని అర్ధమైపోయింది. అందుకనే వైసీపీలో చేరుతారని ఒకసారి లేదు లేదు టీడీపీలో చేరబోతున్నారని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇపుడు సడెన్ డెవలప్మెంట్ కారణంగా టీడీపీలో చేరటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగానే శైలజ టీడీపీలో చేరి పోటీచేస్తే ఇప్పటికే ఉన్న గ్రూపులన్నీ ఏకమై వ్యతిరేకం చేస్తే అప్పుడు ఏమవుతుంది ?

This post was last modified on April 27, 2023 12:35 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

3 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

10 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

11 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago