Political News

తెలంగాణ ఓటర్లపై రిజర్వేషన్ అస్త్రం

బీజేపీని తెలంగాణలో అధికారానికి తీసుకొస్తే ముస్లిం కోటాను రద్దు చేస్తామని చేవెళ్ల సభలో అమిత్ షా ప్రకటించినప్పుడు జనం లైట్ తీసుకున్నా.. అందులో చాలా సీరియస్ నేస్ ఉందని తేలిపోయింది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ 12 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న తరుణంలోనే అమిత్ షా బీ-52 బాంబర్ తో దాడి చేసినట్లయ్యింది. పక్కా వ్యూహంతోనే ఎన్నికల ముందు అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నట్లు సమాచారం. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని బీజీపీ నిర్ణయించింది. కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో కూడా ప్రయోగించాలని బీజేపీ నిర్ణయించింది. అమిత్ షా ప్రకటనతో హిందూ ఓట్లను ఏకం చేస్తాయని కమలం పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో అమిత్ షా ప్రకటనను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు, ఎంఐఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

రిజర్వేషన్ విధానాన్ని పునసమీక్షించాలని చాలా రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. రిజర్వేషన్ రద్దు బీజేపీ, ఆరెస్సెస్ రహస్య అంజెడా అని కొన్ని దళిత సంఘాలు ఆరోపిస్తున్నారు. ముమ్మారు తలాఖ్ రద్దు, కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే 370వ అధికరణం రద్దు తర్వాత రిజర్వేషన్ రద్దు కూడా బీజేపీ అజెండాలో తదుపరి అంశమని ఆ పార్టీ వ్యతిరేకులు కొందరు వాదిస్తున్నారు. ఆ మాట నిజమెంతో తెలీదు కానీ, అమిత్ షా ప్రకటన మాత్రం ఆలోచింపజేస్తోంది. పైగా తెలంగాణలో మాట్లాడిన మాటే ఆయన కర్ణాటకలో కూడా రిపీట్ చేశారు. ఇప్పటికే కర్ణాటక ముస్లిం రిజర్వేషన్ అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. మే 10 వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం కన్నడ ప్రభుత్వాన్ని ఆదేశించింది..

తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని పదే పదే చెబుతున్న అమిత్ షా తాజా వ్యాఖ్యల వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంకు చెక్ పెట్టడంలో భాగంగానే అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల అంశం తెరమీదకు తీసుకొచ్చారని బీజేపీ వర్గాల‌ సమాచారం. అందులోనూ కొన్ని సార్లు రహస్యంగా, కొన్ని సార్లు బహిరంగంగా మిత్రపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంలను ఒకేసారి దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోంది. ముస్లింలు ప్రాబల్యం ఉన్న యాభై నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇదీ బీఆర్ఎస్ కు ప్రయోజనం కలిగించే చర్యగా బీజేపీ అనుమానించింది. అందుకే ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లను సంఘటితపరిచే దిశగానే రిజర్వేషన్ రద్దు అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు భావిస్తున్నారు.

ముస్లిం మైనారిటీ ఓట్లును చీల్చితే బీఆర్ఎస్, ఎంఐఎం ను దెబ్బ కొట్టొచ్చని అమిత్ షా భావించారు. నాన్ ముస్లిం ఓట్లను ఏకం చేసి వీలైతే గంపగుత్తగా బీజేపీకి పడేట్టుగా చూడటం కోసం అమిత్ షా మాట్లాడుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక తప్పితే ఎక్కడా బీజేపీ అధికారంలో లేదు. ఏదో విధంగా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలం పార్టీ భావిస్తుంది. అప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ లబ్ధి పొందే అవకాశం ఉందని నమ్ముతోంది. ఎందుకంటే ఉత్తరాదిన లోక్ సభా స్థానాలు తగ్గితే వాటిని తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలతో భర్తీ చేసుకోవచ్చు.

This post was last modified on April 27, 2023 10:25 am

Share

Recent Posts

ఇంటా బ‌య‌టా… నీట్‌ నిప్పులు!

కేంద్ర ప్ర‌భుత్వానికి ఇంటా బ‌య‌టా కూడా.. నీట్ ప‌రీక్ష‌కు సంబంధించిన సెగ భారీగా త‌గులుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ…

41 minutes ago

అన్నయ్య డ్రాప్… తమ్ముడు ఫిక్స్ ?

బస్సులో మనం ఒక సీట్ ని రిజర్వ్ చేసుకుని, తీరా ప్రయాణానికి వెళ్లలేకపోతే వేరొకరికి ఇవ్వడమో లేదా అమ్మడమో జరుగుతుంది.…

54 minutes ago

కొడుకును తప్పించాలని చూసిన వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ ను హిట్…

1 hour ago

మణిశర్మ ఋజువు చేసుకోవడమే కీలకం

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద బజ్ బాగానే ఉంది. కిరణ్ అబ్బవరం కెరీర్…

1 hour ago

ధర్మేంద్ర ప్రదాన్… నాడలా, నేడిలా!

దేశ రాజధానిలో రగులుకున్న విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్తితి. ఈ పరిస్థితికి కారణం బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, కేంద్ర…

1 hour ago

మాటలు చెప్పినంత మాత్రాన తాను దీక్ష ఆపేది లేదు

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని…

3 hours ago