Political News

జ‌గ‌న్‌కు 48 గంట‌ల గ‌డువిచ్చిన చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లిస్తూ.. మూడు రాజ‌ధానుల తీర్మానానికి గ‌వ‌ర్న‌ర్ చేత జ‌గ‌న్ స‌ర్కారు ఆమోద ముద్ర వేయించుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు. ఐతే అమ‌రావ‌తి విష‌యంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై జ‌నాభిప్రాయం ఏంటో తెలుసుకోవాల‌న్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంద‌రితో రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాలు విసురుతున్నారు వైకాపా నాయ‌కులు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఇదే డిమాండ్ చేసి బాబును ఇరుకున పెట్టారు. దీనిపై బాబు ఎలా స్పందిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే బాబు దీనికి ప్ర‌తిగా కొత్త స‌వాల్ విసిరారు.

మొత్తంగా అసెంబ్లీనే ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాలు విస‌ర‌డం విశేషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారన్న బాబు.. ఇలా మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సవాల్ విసిరారు. ఇప్పుడు ప్ర‌భుత్వం ఎత్తుకున్న మూడు రాజధానుల ప్ర‌తిపాద‌న‌ను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌ ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు.. ఏపీ రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల సమస్య అని.. కులాలు, మతాల సమస్య కాదని చెప్పారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడానికి 48 గంటలు సమయం ఇస్తున్నామని.. అలా అయితే తామంద‌రం రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌ని బాబు ప్ర‌క‌టించారు. దీనిపై వైకాపా నాయ‌కులేమంటారో చూడాలి.

This post was last modified on August 4, 2020 6:15 am

Share
Show comments
Published by
suman

Recent Posts

సింగిల్ డే… జగన్ కు డబుల్ స్ట్రోక్స్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…

23 minutes ago

అవకాశాలు వదిలేస్తున్న విశ్వంభర

జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…

56 minutes ago

చంద్ర‌బాబు.. ఎస్టీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీల‌కు భారీ మేలును…

1 hour ago

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…

1 hour ago

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

4 hours ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

6 hours ago