Political News

జ‌గ‌న్‌కు 48 గంట‌ల గ‌డువిచ్చిన చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లిస్తూ.. మూడు రాజ‌ధానుల తీర్మానానికి గ‌వ‌ర్న‌ర్ చేత జ‌గ‌న్ స‌ర్కారు ఆమోద ముద్ర వేయించుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు. ఐతే అమ‌రావ‌తి విష‌యంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై జ‌నాభిప్రాయం ఏంటో తెలుసుకోవాల‌న్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంద‌రితో రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాలు విసురుతున్నారు వైకాపా నాయ‌కులు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఇదే డిమాండ్ చేసి బాబును ఇరుకున పెట్టారు. దీనిపై బాబు ఎలా స్పందిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే బాబు దీనికి ప్ర‌తిగా కొత్త స‌వాల్ విసిరారు.

మొత్తంగా అసెంబ్లీనే ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాలు విస‌ర‌డం విశేషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారన్న బాబు.. ఇలా మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సవాల్ విసిరారు. ఇప్పుడు ప్ర‌భుత్వం ఎత్తుకున్న మూడు రాజధానుల ప్ర‌తిపాద‌న‌ను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌ ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు.. ఏపీ రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల సమస్య అని.. కులాలు, మతాల సమస్య కాదని చెప్పారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడానికి 48 గంటలు సమయం ఇస్తున్నామని.. అలా అయితే తామంద‌రం రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌ని బాబు ప్ర‌క‌టించారు. దీనిపై వైకాపా నాయ‌కులేమంటారో చూడాలి.

This post was last modified on August 4, 2020 6:15 am

Share
Show comments
Published by
suman

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago