Political News

విచారణలో ముగ్గురినీ కలుపుతారా ?

వివేకానందరెడ్డి హత్యకేసులో ముగ్గురిని కలిపి విచారించేందుకు సీబీఐ రెడీ అవుతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిని ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని 25వ తేదీవరకు అరెస్టు చేయద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు విచారణలో సహకరించాలని ఎంపీకి చెప్పింది.

బుధవారం అవినాష్ ను సీబీఐ ప్రశ్నించబోతోంది. అందుకనే తమ ఆఫీసుకు రమ్మని నోటీసిచ్చింది. ఎలాగూ అవినాష్ వస్తారు కాబట్టి ఇదే సమయానికి డాక్టర్ ఉదయ్, భాస్కర్ ను కూడా ఆఫీసుకు తీసుకొచ్చే అవకాశముందని సమాచారం. జైల్లోనే వీళ్ళిద్దరిని విచారించేట్లయితే తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టును సీబీఐ అడగాల్సిన అవసరంలేదు. అయినా అడిగిందంటే ఉద్దేశ్యం ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతోంది. భాస్కర్ రెడ్డి ఎంపీకి తండ్రి అయితే డాక్టర్ అత్యంత సన్నిహితుడు.

అందుకనే ముగ్గురిని కలిపి విచారిస్తేనే చాలా విషయాలు బయటకు వస్తాయని సీబీఐ అనుకుంటోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపీ విషయంలో సీబీఐ ప్రధానంగా ఆధారపడింది గుగుల్ టేకౌట్ సాంకేతికత మీదనే. అయితే దాన్ని ప్రామాణికంగా తీసుకునేందుకు లేదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఎంపీ ప్రజాప్రతినిధి కాబట్టి ప్రతిరోజు ఎంతోమంది ఎంపీ దగ్గరకు వచ్చి వెళుతుంటారు. ఎక్కడైనా నేరం చేసిన వాళ్ళు ఎంపీ ఇంటికి వచ్చి వెళ్ళినంత మాత్రాన ఎంపీకి కూడా నేరంలో భాగస్వామ్యముందని ఎలా చెప్పగలరన్న హైకోర్టు ప్రశ్నకు సీబీఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు.

గుగుల్ టేకౌట్ ద్వారా మొబైల్ ఫోన్ మూమెంట్ ఏ రోజు ఏ గంటలో ఎక్కడుందో చెప్పచ్చేకానీ జరిగిన నేరంతో ఎవరెవరికి సంబంధాలున్నాయో చెప్పే అవకాశంలేదని కోర్టు చెప్పింది. దాంతో సీబీఐ లాయర్ కు ఏమిమాట్లాడాలో దిక్కుతోచలేదు. కాబట్టి గుగుల్ టేకౌట్ ఒక్కదాన్నే ఆధారంగా చేసుకుని ఎంపీని దోషిగా తేల్చాలంటే అది జరిగేపనికాదని తేలిపోయింది. కాంక్రీట్ ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోర్టు ప్రశ్నకు లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. అందుకనే కోర్టు ఎంపీకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. మరి తాజా విచారణలో సీబీఐ ఎలాంటి సాక్ష్యాలు సేకరిస్తుందో చూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago