రాబోయే ఎన్నికల్లో అధికారం అందుకోవటమే టార్గెట్ గా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అధికారం అందుకోవాలంటే ముందు మెజారిటి సీట్లు గెలవాలి. మెజారిటి సీట్లు గెలవాలంటే అభ్యర్ధుల ఎంపికను పూర్తిచేసి వీలైనంత తొందరగా ప్రకటించేయాలి. అప్పుడే అభ్యర్ధులు జనాల్లో ఒకటికి రెండుమూడుసార్లు తిరిగి ప్రచారం చేసుకునేందుకు వీలవుతుంది. ఇదే సమయంలో తమపైన అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించి దారికి తెచ్చుకునే అవకాశాలుంటాయి. అలాకాకుండా గతంలో లాగే చివరి నిముషంలో అభ్యర్ధులను ప్రకటిస్తే అంతే సంగతులు.
ఈ విషయం రాజకీయంగా క్లైమ్యాక్సుకు చేరుకున్న దశలో చంద్రబాబుకు అర్ధమైంది. అందుకనే వీలైనన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇఫ్పటివరకు సుమారు 75 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. కొందరిని పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా ప్రకటించారు. ఇద్దరిలో ఎవరు ప్రకటించారని కాకుండా ఎన్నికలకు ఏడాదిముందే అభ్యర్ధుల ప్రకటనకు శ్రీకారం చుట్టారన్నదే కీలకం. అభ్యర్ధుల ఎంపికలో కూడా చంద్రబాబు దూకుడు చూపిస్తున్నారు.
రకరకాలుగా నేతలపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని అన్నీ సర్వే రిపోర్టులను చూసుకుని అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇపుడు ప్రకటించిన అభ్యర్ధులను మార్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. కాకపోతే జనసేనతో పొత్తు ఖాయమైతే అప్పుడు ఏమిచేస్తారనేదే పెద్ద ప్రశ్న. 175 నియోజకవర్గాల్లో 75 చోట్ల అభ్యర్ధులను ప్రకటించారంటే పొత్తులు, సీట్ల విషయాలను చంద్రబాబు ఆలోచించకుండానే ప్రకటిస్తారా ? అనే సందేహం కూడా ఉంది. ఇక్కడే తమ్ముళ్ళల్లో పెరిగిపోతున్న సందేహం ఏమిటంటే అసలు జనసేనతో పొత్తుంటుందా అని.
తమ్ముళ్ళల్లోనే కొందరేమో పొత్తులు అవసరంలేదని వాదిస్తుంటే మరికొందరేమో పొత్తుండాల్సిందే అని చెబుతున్నారు. చివరకు చంద్రబాబు నిర్ణయం ఎలాగుంటుందో తెలీదుకానీ ఇప్పటికైతే పొత్తుల విషయంలో తమ్ముళ్ళల్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇపుడు ప్రకటించిన సీట్లలో అత్యధికం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలోని 14 సీట్లలో 11 చోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. వివాదాస్పదమైన ఆళ్ళగడ్డ, నంద్యాల, నందికొట్కూరులో మాత్రమే పెండింగ్ పెట్టారు. నంద్యాల, ఆళ్ళగడ్డలో భూమా కుటుంబానికి టికెట్లిస్తారా ఇవ్వరా అన్నదే సస్పెన్సుగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్లిస్తారో చూడాల్సిందే.
This post was last modified on April 16, 2023 3:12 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…