బడ్జెట్ ఎంత అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఇండియాలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అతి పెద్ద బడ్జెట్ ‘శాకుంతలం’దే అని చెప్పుకున్నాడు రిలీజ్ ముంగిట దర్శక నిర్మాత గుణశేఖర్. కానీ అంత ఖర్చు పెట్టిన సినిమాకు రిలీజ్ ముంగిట సరైన బజ్ తీసుకురాలేకపోయారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. విడుదల ముంగిట చేసిన ప్రమోషన్ల హడావుడి కూడా సరిపోలేదు.
తొలి రోజు డల్లుగా మొదలైన సినిమాకు నెగెటివ్ టాక్ పెద్ద డ్యామేజే చేసింది. అసలే లేడీ ఓరియెంటెడ్ సినిమా.. పైగా బజ్ తక్కువ.. దీనికి తోడు నెగెటివ్ టాక్.. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలుస్తుంది. తొలి రోజు వసూళ్లతోనే సినిమాకు పరాభవం తప్పదని తేలిపోయింది. శని, ఆదివారాల్లో కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. దీంతో పాటుగా రిలీజైన డబ్బింగ్ సినిమా ‘విడుదల’ పరిస్థితే మెరుగ్గా ఉంది.
అంతకుమించి ‘శాకుంతలం’ టీంకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రెండు వారాల ముందు రిలీజైన ‘దసరా’ సినిమాకు తెలంగాణలో ‘శాకుంతలం’ కంటే ఎక్కువ షేర్ వస్తుండటం. ఏరియా ఏదైనా సరే సమీపంలో దసరా, శాకుంతలం ఆడుతున్న థియేటర్ల కలెక్షన్లను పరిశీలిస్తే.. ‘దసరా’కే ఎక్కువ కలెక్షన్లు ఉంటున్నాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో శనివారం ప్రతి షోకూ ‘శాకుంతలం’తో పోలిస్తే 50-60 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టే ‘శాకుంతలం’ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం కూడా సినిమా ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక వీకెండ్ అయ్యాక షేర్ నామమాత్రంగా ఉండబోతోందన్నది స్పష్టం. సినిమా థియేట్రికల్ రన్ ముగియడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదేదో మామూలు సినిమా అయితే సరేలే అనుకోవచ్చు. కానీ గుణశేఖర్ ఇన్నేళ్లలో సంపాదించిందంతా ఈ సినిమా మీద పెట్టేయడమే బాధాకరం.
This post was last modified on April 16, 2023 4:48 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…