బడ్జెట్ ఎంత అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఇండియాలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అతి పెద్ద బడ్జెట్ ‘శాకుంతలం’దే అని చెప్పుకున్నాడు రిలీజ్ ముంగిట దర్శక నిర్మాత గుణశేఖర్. కానీ అంత ఖర్చు పెట్టిన సినిమాకు రిలీజ్ ముంగిట సరైన బజ్ తీసుకురాలేకపోయారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. విడుదల ముంగిట చేసిన ప్రమోషన్ల హడావుడి కూడా సరిపోలేదు.
తొలి రోజు డల్లుగా మొదలైన సినిమాకు నెగెటివ్ టాక్ పెద్ద డ్యామేజే చేసింది. అసలే లేడీ ఓరియెంటెడ్ సినిమా.. పైగా బజ్ తక్కువ.. దీనికి తోడు నెగెటివ్ టాక్.. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలుస్తుంది. తొలి రోజు వసూళ్లతోనే సినిమాకు పరాభవం తప్పదని తేలిపోయింది. శని, ఆదివారాల్లో కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. దీంతో పాటుగా రిలీజైన డబ్బింగ్ సినిమా ‘విడుదల’ పరిస్థితే మెరుగ్గా ఉంది.
అంతకుమించి ‘శాకుంతలం’ టీంకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రెండు వారాల ముందు రిలీజైన ‘దసరా’ సినిమాకు తెలంగాణలో ‘శాకుంతలం’ కంటే ఎక్కువ షేర్ వస్తుండటం. ఏరియా ఏదైనా సరే సమీపంలో దసరా, శాకుంతలం ఆడుతున్న థియేటర్ల కలెక్షన్లను పరిశీలిస్తే.. ‘దసరా’కే ఎక్కువ కలెక్షన్లు ఉంటున్నాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో శనివారం ప్రతి షోకూ ‘శాకుంతలం’తో పోలిస్తే 50-60 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టే ‘శాకుంతలం’ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం కూడా సినిమా ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక వీకెండ్ అయ్యాక షేర్ నామమాత్రంగా ఉండబోతోందన్నది స్పష్టం. సినిమా థియేట్రికల్ రన్ ముగియడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదేదో మామూలు సినిమా అయితే సరేలే అనుకోవచ్చు. కానీ గుణశేఖర్ ఇన్నేళ్లలో సంపాదించిందంతా ఈ సినిమా మీద పెట్టేయడమే బాధాకరం.
This post was last modified on April 16, 2023 4:48 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…