Movie News

‘శాకుంతలం’ కన్నా ‘దసరా’కు ఎక్కువ


బడ్జెట్ ఎంత అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఇండియాలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అతి పెద్ద బడ్జెట్ ‘శాకుంతలం’దే అని చెప్పుకున్నాడు రిలీజ్ ముంగిట దర్శక నిర్మాత గుణశేఖర్. కానీ అంత ఖర్చు పెట్టిన సినిమాకు రిలీజ్ ముంగిట సరైన బజ్ తీసుకురాలేకపోయారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. విడుదల ముంగిట చేసిన ప్రమోషన్ల హడావుడి కూడా సరిపోలేదు.

తొలి రోజు డల్లుగా మొదలైన సినిమాకు నెగెటివ్ టాక్ పెద్ద డ్యామేజే చేసింది. అసలే లేడీ ఓరియెంటెడ్ సినిమా.. పైగా బజ్ తక్కువ.. దీనికి తోడు నెగెటివ్ టాక్.. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలుస్తుంది. తొలి రోజు వసూళ్లతోనే సినిమాకు పరాభవం తప్పదని తేలిపోయింది. శని, ఆదివారాల్లో కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. దీంతో పాటుగా రిలీజైన డబ్బింగ్ సినిమా ‘విడుదల’ పరిస్థితే మెరుగ్గా ఉంది.

అంతకుమించి ‘శాకుంతలం’ టీంకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రెండు వారాల ముందు రిలీజైన ‘దసరా’ సినిమాకు తెలంగాణలో ‘శాకుంతలం’ కంటే ఎక్కువ షేర్ వస్తుండటం. ఏరియా ఏదైనా సరే సమీపంలో దసరా, శాకుంతలం ఆడుతున్న థియేటర్ల కలెక్షన్లను పరిశీలిస్తే.. ‘దసరా’కే ఎక్కువ కలెక్షన్లు ఉంటున్నాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శనివారం ప్రతి షోకూ ‘శాకుంతలం’తో పోలిస్తే 50-60 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టే ‘శాకుంతలం’ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం కూడా సినిమా ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక వీకెండ్ అయ్యాక షేర్ నామమాత్రంగా ఉండబోతోందన్నది స్పష్టం. సినిమా థియేట్రికల్ రన్ ముగియడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదేదో మామూలు సినిమా అయితే సరేలే అనుకోవచ్చు. కానీ గుణశేఖర్ ఇన్నేళ్లలో సంపాదించిందంతా ఈ సినిమా మీద పెట్టేయడమే బాధాకరం.

This post was last modified on April 16, 2023 4:48 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

6 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

6 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

7 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

8 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

8 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

10 hours ago