బడ్జెట్ ఎంత అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఇండియాలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అతి పెద్ద బడ్జెట్ ‘శాకుంతలం’దే అని చెప్పుకున్నాడు రిలీజ్ ముంగిట దర్శక నిర్మాత గుణశేఖర్. కానీ అంత ఖర్చు పెట్టిన సినిమాకు రిలీజ్ ముంగిట సరైన బజ్ తీసుకురాలేకపోయారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. విడుదల ముంగిట చేసిన ప్రమోషన్ల హడావుడి కూడా సరిపోలేదు.
తొలి రోజు డల్లుగా మొదలైన సినిమాకు నెగెటివ్ టాక్ పెద్ద డ్యామేజే చేసింది. అసలే లేడీ ఓరియెంటెడ్ సినిమా.. పైగా బజ్ తక్కువ.. దీనికి తోడు నెగెటివ్ టాక్.. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలుస్తుంది. తొలి రోజు వసూళ్లతోనే సినిమాకు పరాభవం తప్పదని తేలిపోయింది. శని, ఆదివారాల్లో కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. దీంతో పాటుగా రిలీజైన డబ్బింగ్ సినిమా ‘విడుదల’ పరిస్థితే మెరుగ్గా ఉంది.
అంతకుమించి ‘శాకుంతలం’ టీంకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రెండు వారాల ముందు రిలీజైన ‘దసరా’ సినిమాకు తెలంగాణలో ‘శాకుంతలం’ కంటే ఎక్కువ షేర్ వస్తుండటం. ఏరియా ఏదైనా సరే సమీపంలో దసరా, శాకుంతలం ఆడుతున్న థియేటర్ల కలెక్షన్లను పరిశీలిస్తే.. ‘దసరా’కే ఎక్కువ కలెక్షన్లు ఉంటున్నాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో శనివారం ప్రతి షోకూ ‘శాకుంతలం’తో పోలిస్తే 50-60 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టే ‘శాకుంతలం’ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం కూడా సినిమా ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక వీకెండ్ అయ్యాక షేర్ నామమాత్రంగా ఉండబోతోందన్నది స్పష్టం. సినిమా థియేట్రికల్ రన్ ముగియడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదేదో మామూలు సినిమా అయితే సరేలే అనుకోవచ్చు. కానీ గుణశేఖర్ ఇన్నేళ్లలో సంపాదించిందంతా ఈ సినిమా మీద పెట్టేయడమే బాధాకరం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…