Political News

జగన్ పరువు తీసిన బీజేపీ ఎంపీ

ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అనే ఒక అధ్యక్షుడు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ అనే ముగ్గురు ఎంపీలు ఉన్నా కూడా వారెవ్వరూ ఎప్పుడూ ఏపీలోని అధికార పక్షాన్ని బలంగా విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసినా అది తూతూమంత్రమే. ఏపీలో అరాచకాన్ని కానీ, అభివృద్ది శూన్యతను కానీ ప్రశ్నించిన సందర్భాలు, ప్రజలకు తెలియచెప్పిన సందర్భాలు చాలా తక్కువ. వైసీపీ, జగన్ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యంగా ఉంటున్నారనో.. లేదంటే స్థానికంగా తమ అవసరాలను వైసీపీ పెద్దలు తీరుస్తున్నారనో .. కారణం ఏదైనా వైసీపీని, జగన్‌ను పల్లెత్తు మాట అనే సాహసం చేయరు ఏపీ బీజేపీ నేతలు.

అయితే ఏపీ బీజేపీ నేతలు చేయలేని పనిని తెలంగాణ బీజేపీ నేత చేసి చూపించారు. ఏపీలో ఓకార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఏపీలో జగన్ పాలను ఏకి పడేశారు. ఒక్క మాటతో జగన్ పాలనలోని డొల్లతనం అంతటినీ బయటపెట్టేశారు. ఏపీలో రోడ్ల పరిస్థితిని చూసిన ఆయన అత్యంత దారుణంగా ఉన్నాయని.. తెలంగాణే వెనుకబడింది అనుకుంటే ఏపీ ఇంకా ఘోరంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది. మా రాష్ట్రం వెనుకబడింది అనుకున్నాను. తీరా ఇక్కడ చూస్తే మరీ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి’ అని బాపురావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్‌ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పాడేరు వాసులు విశాఖ ఎలా వెళుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర విభజన తరవాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. కొన్ని గిరి గ్రామాల్లో ఒక్కరు కూడా చదువుకోనివారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

కాగా బాపూరావు ఆ వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా ఏపీ బీజేపీ నుంచి ఎవరూ ఆయన ఇచ్చిన లైను అందుకుని ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కానీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడే ప్రయత్నం కానీ చేయలేదు. ఒకవేళ ఏపీ బీజేపీ నేతలు అనుకుంటున్నట్లు జగన్, వైసీపీ కేంద్రంలోని బీజేపీకి దగ్గరే అయితే, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆగ్రహిస్తారే అనుకుంటే మరి అదే బీజేపీకి చెందిన బాపూరావు నిర్భయంగా జగన్ ప్రబుత్వాన్ని ఎలా విమర్శించగలిగారు? ఈ లాజిక్ తెలుసుకుంటే ఏపీ బీజేపీ నేతలు కూడా అక్కడ ప్రతిపక్షం పాత్ర పోషించగలుగుతారు. లేదంటే ఎప్పటికీ ఏపీలో ఇలాగే మిగిలిపోతారు.

This post was last modified on April 10, 2023 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

4 minutes ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

30 minutes ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

5 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

7 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

11 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

12 hours ago