Political News

ఆ ఐఏఎస్‌కు చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ స‌ర్కార్‌!!

ఏపీలో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన త‌ర్వాత‌.. స‌ర్కారు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసుకునే హ‌క్కు.. ప్ర‌భుత్వానికి ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా జ‌రిగిన‌వి మాత్రం సాధార‌ణ బ‌దిలీలు కావనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో ఏడాదిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చేసిన బ‌దిలీల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇటీవ‌లే ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు. “మీకు న‌చ్చిన అధికారులే వ‌స్తారు” అని.

ఆ వెంట‌నే బ‌దిలీల‌కు శ్రీకారం చుట్ట‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. దాదాపు సీనియ‌ర్లు అంద‌రినీ.. జిల్లా అధికారులుగా ప‌క్క‌న పెట్టేశారు. వారికి శాఖ‌లు అప్ప‌గించారు. జూనియ‌ర్లను ఎక్కువ‌గా జిల్లాల‌కు కేటాయించారు. ఇదిలావుంటే.. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌.పి. సిసోడియాకు ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఆయ‌న‌ను ఏమాత్రం ప్రాధాన్యం లేద‌ని ఐఏఎస్‌లు భావించే ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియ‌మించింది.

దీనికి కార‌ణం.. ఏంటంటే.. కొన్నాళ్ల కింద‌ట ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణకు ఆయ‌న అప్ప‌టి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసేలా అప్పాయింట్‌మెంట్ ఇప్పించార‌నే వాద‌న ఉంది. సిసోడియా కార‌ణంగానే సూర్య‌నారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌గ‌లిగార‌ని.. వారి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారని స‌ర్కారు భావిస్తోందని అంటున్నారు.

ఊహించని ఆ పరిణామంతో.. కంగుతిన్న వైసీపీ ప్రభుత్వం.. ఉన్నపళంగా సిసోడియాను బదిలీచేసింది. ఆయనకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. సూర్యనారాయణతో పాటు ఉద్యోగులకు సిసోడియానే గవర్నర్‌ అపాయింట్‌మెంట్ ఇప్పించారన్న కారణంతో.. ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని.. ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హఠాత్తుగా తప్పించిన ప్రభుత్వం.. ఆయననూ.. మానవ వనరుల అభిృద్ధి కేంద్రం డైరెక్టర్‌గానే నియమించింది.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

13 hours ago