ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. సర్కారు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసుకునే హక్కు.. ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. తాజాగా జరిగినవి మాత్రం సాధారణ బదిలీలు కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేసిన బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవలే ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ తేల్చి చెప్పారు. “మీకు నచ్చిన అధికారులే వస్తారు” అని.
ఆ వెంటనే బదిలీలకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు సీనియర్లు అందరినీ.. జిల్లా అధికారులుగా పక్కన పెట్టేశారు. వారికి శాఖలు అప్పగించారు. జూనియర్లను ఎక్కువగా జిల్లాలకు కేటాయించారు. ఇదిలావుంటే.. గవర్నర్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్.పి. సిసోడియాకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనను ఏమాత్రం ప్రాధాన్యం లేదని ఐఏఎస్లు భావించే ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమించింది.
దీనికి కారణం.. ఏంటంటే.. కొన్నాళ్ల కిందట ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణకు ఆయన అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసేలా అప్పాయింట్మెంట్ ఇప్పించారనే వాదన ఉంది. సిసోడియా కారణంగానే సూర్యనారాయణ గవర్నర్ను కలవగలిగారని.. వారి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారని సర్కారు భావిస్తోందని అంటున్నారు.
ఊహించని ఆ పరిణామంతో.. కంగుతిన్న వైసీపీ ప్రభుత్వం.. ఉన్నపళంగా సిసోడియాను బదిలీచేసింది. ఆయనకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. సూర్యనారాయణతో పాటు ఉద్యోగులకు సిసోడియానే గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించారన్న కారణంతో.. ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని.. ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హఠాత్తుగా తప్పించిన ప్రభుత్వం.. ఆయననూ.. మానవ వనరుల అభిృద్ధి కేంద్రం డైరెక్టర్గానే నియమించింది.
This post was last modified on April 7, 2023 10:50 am
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…