Political News

మ‌న‌ది వైసీపీ కాదు.. టీడీపీ: చంద్ర‌బాబు వార్నింగ్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌పై క‌న్నెర్ర చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ విధానాల‌ను మాత్ర‌మే విమ‌ర్శిస్తూ..వ‌చ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఏపీలోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఒక‌వైపు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే.. మ‌రోవైపు పార్టీలోక‌ట్టుత‌ప్పుతున్న నేత‌ల‌కు గ‌ట్టివార్నింగే ఇచ్చారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాళ్లబేరానికి వ‌స్తామ‌ని అనుకుంటున్నారేమో.. మ‌న‌ది వైసీపీ కాదు.. అని హెచ్చ‌రించారు.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. విశాఖ‌లో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని, కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు.

విభేదాలు సృష్టించాల‌ని చూసేవారికి, గ్రూపులు కట్టిన వారికి పదవులు రావని.. టికెట్లు కూడా క‌ష్ట‌మేన‌ని చంద్ర‌బాబు స్పష్టంచేశారు. పార్టీ బలోపేతం కోసం బయటివాళ్లు వస్తే చేర్చుకోవలసిన అవసరముందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు.

“ప్ర‌భుత్వం పోరాడ‌మంటే కొంద‌రు నాయ‌కులు.. ఇళ్ల‌లో పోరాటాలు చేస్తున్నారు. పోలసుల‌ను ఇళ్ల‌కు పిలిపించుకుని త‌మ‌కు తామే గృహ నిర్బంధాలు చేయించుకుంటున్నారు. నాకు తెలియ‌దని అనుకుంటున్నారు. అన్నీ గ‌మ‌నిస్తున్నా.. జాగ్ర‌త్త‌గా ఉండండి” అని కొంద‌రు నాయ‌కుల‌ను పేరు చెప్ప‌కుండానే చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇది ఒక అవ‌కాశమ‌ని.. దీనిని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగుదామ‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

27 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

47 minutes ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

3 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

3 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

4 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

4 hours ago