Political News

మ‌న‌ది వైసీపీ కాదు.. టీడీపీ: చంద్ర‌బాబు వార్నింగ్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌పై క‌న్నెర్ర చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ విధానాల‌ను మాత్ర‌మే విమ‌ర్శిస్తూ..వ‌చ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఏపీలోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఒక‌వైపు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే.. మ‌రోవైపు పార్టీలోక‌ట్టుత‌ప్పుతున్న నేత‌ల‌కు గ‌ట్టివార్నింగే ఇచ్చారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాళ్లబేరానికి వ‌స్తామ‌ని అనుకుంటున్నారేమో.. మ‌న‌ది వైసీపీ కాదు.. అని హెచ్చ‌రించారు.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. విశాఖ‌లో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని, కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు.

విభేదాలు సృష్టించాల‌ని చూసేవారికి, గ్రూపులు కట్టిన వారికి పదవులు రావని.. టికెట్లు కూడా క‌ష్ట‌మేన‌ని చంద్ర‌బాబు స్పష్టంచేశారు. పార్టీ బలోపేతం కోసం బయటివాళ్లు వస్తే చేర్చుకోవలసిన అవసరముందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు.

“ప్ర‌భుత్వం పోరాడ‌మంటే కొంద‌రు నాయ‌కులు.. ఇళ్ల‌లో పోరాటాలు చేస్తున్నారు. పోలసుల‌ను ఇళ్ల‌కు పిలిపించుకుని త‌మ‌కు తామే గృహ నిర్బంధాలు చేయించుకుంటున్నారు. నాకు తెలియ‌దని అనుకుంటున్నారు. అన్నీ గ‌మ‌నిస్తున్నా.. జాగ్ర‌త్త‌గా ఉండండి” అని కొంద‌రు నాయ‌కుల‌ను పేరు చెప్ప‌కుండానే చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇది ఒక అవ‌కాశమ‌ని.. దీనిని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగుదామ‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

This post was last modified on April 6, 2023 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago