టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలపై కన్నెర్ర చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విధానాలను మాత్రమే విమర్శిస్తూ..వచ్చిన చంద్రబాబు ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మూడు జిల్లాల పర్యటన నిమిత్తం ఏపీలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. మరోవైపు పార్టీలోకట్టుతప్పుతున్న నేతలకు గట్టివార్నింగే ఇచ్చారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాళ్లబేరానికి వస్తామని అనుకుంటున్నారేమో.. మనది వైసీపీ కాదు.. అని హెచ్చరించారు.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. విశాఖలో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని, కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు.
విభేదాలు సృష్టించాలని చూసేవారికి, గ్రూపులు కట్టిన వారికి పదవులు రావని.. టికెట్లు కూడా కష్టమేనని చంద్రబాబు స్పష్టంచేశారు. పార్టీ బలోపేతం కోసం బయటివాళ్లు వస్తే చేర్చుకోవలసిన అవసరముందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, ఈ విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
“ప్రభుత్వం పోరాడమంటే కొందరు నాయకులు.. ఇళ్లలో పోరాటాలు చేస్తున్నారు. పోలసులను ఇళ్లకు పిలిపించుకుని తమకు తామే గృహ నిర్బంధాలు చేయించుకుంటున్నారు. నాకు తెలియదని అనుకుంటున్నారు. అన్నీ గమనిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి” అని కొందరు నాయకులను పేరు చెప్పకుండానే చంద్రబాబు హెచ్చరించారు. ఇది ఒక అవకాశమని.. దీనిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుదామని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on April 6, 2023 10:30 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…