Political News

మ‌న‌ది వైసీపీ కాదు.. టీడీపీ: చంద్ర‌బాబు వార్నింగ్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌పై క‌న్నెర్ర చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ విధానాల‌ను మాత్ర‌మే విమ‌ర్శిస్తూ..వ‌చ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఏపీలోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఒక‌వైపు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే.. మ‌రోవైపు పార్టీలోక‌ట్టుత‌ప్పుతున్న నేత‌ల‌కు గ‌ట్టివార్నింగే ఇచ్చారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాళ్లబేరానికి వ‌స్తామ‌ని అనుకుంటున్నారేమో.. మ‌న‌ది వైసీపీ కాదు.. అని హెచ్చ‌రించారు.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. విశాఖ‌లో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని, కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు.

విభేదాలు సృష్టించాల‌ని చూసేవారికి, గ్రూపులు కట్టిన వారికి పదవులు రావని.. టికెట్లు కూడా క‌ష్ట‌మేన‌ని చంద్ర‌బాబు స్పష్టంచేశారు. పార్టీ బలోపేతం కోసం బయటివాళ్లు వస్తే చేర్చుకోవలసిన అవసరముందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు.

“ప్ర‌భుత్వం పోరాడ‌మంటే కొంద‌రు నాయ‌కులు.. ఇళ్ల‌లో పోరాటాలు చేస్తున్నారు. పోలసుల‌ను ఇళ్ల‌కు పిలిపించుకుని త‌మ‌కు తామే గృహ నిర్బంధాలు చేయించుకుంటున్నారు. నాకు తెలియ‌దని అనుకుంటున్నారు. అన్నీ గ‌మ‌నిస్తున్నా.. జాగ్ర‌త్త‌గా ఉండండి” అని కొంద‌రు నాయ‌కుల‌ను పేరు చెప్ప‌కుండానే చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇది ఒక అవ‌కాశమ‌ని.. దీనిని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగుదామ‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

Satya

Recent Posts

గీతాంజలి… ఇలాంటివి కదా చూడాలి

గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…

1 hour ago

పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…

3 hours ago

దృశ్యం 3 తెలుగు అభిమానులకు షాక్

రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…

3 hours ago

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…

4 hours ago

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…

4 hours ago

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…

5 hours ago