Political News

సంజయ్ అరెస్ట్.. మోదీ వరకు వెళ్లిన వ్యవహారం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చేరింది. జేపీ నడ్డా, అమిత్ షాలను దాటి ప్రధాని మోదీకి విషయం తెలిసింది. సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ హైకమాండ్ తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ ప్రధాని మోదీని కలిసి విషయం వివరించారు. దీంతో బండి సంజయ్‌కు పార్టీ పూర్తిగా అండగా ఉండాలని మోదీ సూచించినట్లు సమాచారం.

దీంతో మోదీతో భేటీ తరువాత జేపీ నడ్డా, అమిత్ షాలు మరికొందరు బీజేపీ కీలక నేతలతో సమావేశమై ఏం చేయాలో చర్చించారని.. తెలంగాణకు చెందిన కొందరు నేతలతో ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఆరా తీశారని చెప్తున్నారు. కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి బండి సంజయ్ కోసం మొత్తం అందరూ రంగంలో దిగాలని సూచించినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే దిల్లీలో ఉన్న రాజ్యసభ ఎంపీ లక్ష్మన్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌లో దిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ప్రభుత్వం పై ఆగ్రహించారు. అమిత్ షా ఆదేశాలతో కిషన్ రెడ్డి వెంటనే తెలంగాణ డీజేపీతో మాట్లాడారు.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావుతో మాట్లాడి విషయం మొత్తం తెలుసుకున్నారు. సంజయ్ అరెస్ట్ తరువాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామలను ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేయాలని ఆయన సూచించారు.

బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌తో పాటు పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో.. సంజయ్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ చేపట్టే కార్యక్రమాలు, నిరసనల బాధ్యతలను ఇతర నేతలు ముందుండి నడపించేలా పార్టీ దిశానిర్దేశం చేస్తోంది.

This post was last modified on April 5, 2023 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై…

1 hour ago

బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా?

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…

1 hour ago

కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…

2 hours ago

శ్రీవిష్ణు అస్సలు తగ్గడం లేదు

ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…

4 hours ago

వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌..…

4 hours ago

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…

4 hours ago