సెలబ్రెటీలు ఎవరైనా పెళ్లి చేసుకోగానే వాళ్లు పిల్లల్ని ఎప్పుడు కాంటారా అని చూస్తారు జనాలు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో ఈ కుతూహలం బాగా ఎక్కువగా ఉంటుంది. పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన మాత్రం.. తల్లిదండ్రులుగా మారడానికి సుదీర్ఘ సమయమే తీసుకున్నారు.
పిల్లలు ఆలస్యం కావడం వల్ల సోషల్ మీడియాలో అనేక కామెంట్లు, కౌంటర్లు కూడా ఎదుర్కొన్నారు. కానీ ముందు అనుకున్న ప్రకారమే ఆలస్యంగా పిల్లల్ని కనాలని నిర్ణయించుకుని.. పెళ్లయిన పదేళ్లకు ఇప్పుడు తల్లిదండ్రుల కాబోతున్నారు. ఉపాసన గర్భం ధరించిన విషయాన్ని గత డిసెంబరులోనే మెగా ఫ్యామిలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు నెలలు నిండుతున్నాయి.
ఈ సందర్భంగా బేబీ షవర్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఉపాసన కుటుంబం. మామూలుగా సీమంతం పేరుతో కొంచెం ట్రెడిషనల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. కానీ ఉపాసన కుటుంబం మాత్రం ఉపాసన బేబీ షవర్ను చాలా మోడర్న్గా బీచ్ ఒడ్డున చేయడం వివేషం. ఆ ప్లేస్ ఎక్కడ అన్నది వెల్లడించలేదు కానీ.. కుటుంబ సభ్యుల మధ్య బేబీ షవర్ కార్యక్రమాన్ని ఒక బీచ్ దగ్గర జరుపుకున్న ఫొటోలతో కూడిన వీడియోను ఉపాసన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల నడుమ చాలా గ్రాండ్గానే చేశారు ఈ కార్యక్రమం.
ఉపాసన బామ్మ ఈ వేడుకలో హైలైట్ అయ్యారు. ఈ వేడుక ఏర్పాటు చేసిన తన సోదరీమణులు అనుష్పాల, సింధూరి రెడ్డిలకు ఉపాసన కృతజ్ఞతలు చెప్పింది. ఉపాసన ఇంకో రెండు మూడు నెలల్లో బిడ్డను ప్రసవిస్తుందని భావిస్తున్నారు. తాము ఆలస్యంగా పిల్లల్ని కనడం గురించి సొసైటీతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నామని, కానీ చివరికి తాను కోరుకున్న సమయంలోనే బిడ్డను కంటున్నానని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 5, 2023 6:20 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…