సెలబ్రెటీలు ఎవరైనా పెళ్లి చేసుకోగానే వాళ్లు పిల్లల్ని ఎప్పుడు కాంటారా అని చూస్తారు జనాలు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో ఈ కుతూహలం బాగా ఎక్కువగా ఉంటుంది. పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన మాత్రం.. తల్లిదండ్రులుగా మారడానికి సుదీర్ఘ సమయమే తీసుకున్నారు.
పిల్లలు ఆలస్యం కావడం వల్ల సోషల్ మీడియాలో అనేక కామెంట్లు, కౌంటర్లు కూడా ఎదుర్కొన్నారు. కానీ ముందు అనుకున్న ప్రకారమే ఆలస్యంగా పిల్లల్ని కనాలని నిర్ణయించుకుని.. పెళ్లయిన పదేళ్లకు ఇప్పుడు తల్లిదండ్రుల కాబోతున్నారు. ఉపాసన గర్భం ధరించిన విషయాన్ని గత డిసెంబరులోనే మెగా ఫ్యామిలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు నెలలు నిండుతున్నాయి.
ఈ సందర్భంగా బేబీ షవర్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఉపాసన కుటుంబం. మామూలుగా సీమంతం పేరుతో కొంచెం ట్రెడిషనల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. కానీ ఉపాసన కుటుంబం మాత్రం ఉపాసన బేబీ షవర్ను చాలా మోడర్న్గా బీచ్ ఒడ్డున చేయడం వివేషం. ఆ ప్లేస్ ఎక్కడ అన్నది వెల్లడించలేదు కానీ.. కుటుంబ సభ్యుల మధ్య బేబీ షవర్ కార్యక్రమాన్ని ఒక బీచ్ దగ్గర జరుపుకున్న ఫొటోలతో కూడిన వీడియోను ఉపాసన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల నడుమ చాలా గ్రాండ్గానే చేశారు ఈ కార్యక్రమం.
ఉపాసన బామ్మ ఈ వేడుకలో హైలైట్ అయ్యారు. ఈ వేడుక ఏర్పాటు చేసిన తన సోదరీమణులు అనుష్పాల, సింధూరి రెడ్డిలకు ఉపాసన కృతజ్ఞతలు చెప్పింది. ఉపాసన ఇంకో రెండు మూడు నెలల్లో బిడ్డను ప్రసవిస్తుందని భావిస్తున్నారు. తాము ఆలస్యంగా పిల్లల్ని కనడం గురించి సొసైటీతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నామని, కానీ చివరికి తాను కోరుకున్న సమయంలోనే బిడ్డను కంటున్నానని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 5, 2023 6:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…