తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు బాగా కావాల్సిన మనిషి అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫొటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. దీంతో బీజేపీ నేతలు తొలుత డిఫెన్సులో పడిన ఆ తరువాత బీఆర్ఎస్ నేతలతో సంజయ్ ఉన్న ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రశాంత్ అసలు ఎవరి మనిషి? అనేది సోసల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా అనేక మంది బీఆర్ఎస్ నేతలతో ప్రశాంత్ ఫొటోలు కనిపిస్తున్నారు. ఈ ఫొటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రశాంత్ బండి సంజయ్ మనిషితే ఈ ఫొటోల సంగతేంటి అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రశాంత్ మీడియాలో పనిచేస్తుండడంతో ఆయన అన్ని పార్టీల వారినీ కలిసే అవకాశం ఉందని.. అలా అని.. ఆయన బీజేపీ మనిషి అంటూ బండి సంజయ్తో లింక్ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
కాగా టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బీజేపీ అధ్యక్షుడికి సన్నిహితుడని.. ఇదంతా సంజయ్ కుట్ర ప్రకారమే జరిగిందంటూ తెలంగాణ పోలీసులు సంజయ్ను అరెస్ట్ చేయడం.. నిరసనలు తెలిసిందే.
సంజయ్ అరెస్ట్ పై బీజేపీ లీగల్ సెల్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. లీకేజ్ పై విచారణ చేయకుండా, అసలైన నిందితులను అరెస్ట్ చేయకుండా, విద్యార్థులకు న్యాయం చేయకుండా బీజేపీని లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తానికి ఈ విషయం ముదిరి తెలంగాణలో రాజకీయ వివాదంగా మారిపోయింది.
This post was last modified on April 5, 2023 6:42 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…