మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ కంచికి చేరింది. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర్నుంచి పట్టుబట్టి అమరావతి నుంచి రాజధానిని తరలించే విషయంలో వడివడిగా అడుగులు వేసిన జగన్ సర్కారు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ వ్యవస్థ ఈ విషయంలో ఏం చేస్తుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి అయితే రాజధాని అమరావతి నుంచి తరలిపోతున్నట్లే. నామమాత్రంగా శాసన వ్యవస్థను మాత్రమే అమరావతిలో కొనసాగించబోతున్నారు. అమరావతిని ఏరికోరి రాజధానిగా ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీకి ఇది మింగుడు పడని వ్యవహారమే. దీనిపై ఆ పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనే బీటెక్ రవి.
మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదానికి నిరసనగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బీటెక్ రవి లేఖ రాశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమన్నారు. చట్ట సభ అయిన శాసనమండలికి దక్కిన ప్రాధాన్యానికి కలత చెందిన తాను అలాంటి ప్రాధాన్యత లేని సభలో ఉండడం అనవసరంగా భావించి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మండలి ఛైర్మన్కు ఫార్మాట్ ప్రకారం రాజీనామాను పంపనున్నట్లు రవి వెల్లడించారు. మరి రవి రాజీనామా లేఖపై చంద్రబాబు ఏమంటారో.. మండలి ఛైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదిస్తారో లేదో చూడాలి.
This post was last modified on July 31, 2020 10:10 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…