Political News

మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ కంచికి చేరింది. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర్నుంచి పట్టుబట్టి అమరావతి నుంచి రాజధానిని తరలించే విషయంలో వడివడిగా అడుగులు వేసిన జగన్ సర్కారు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ వ్యవస్థ ఈ విషయంలో ఏం చేస్తుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి అయితే రాజధాని అమరావతి నుంచి తరలిపోతున్నట్లే. నామమాత్రంగా శాసన వ్యవస్థను మాత్రమే అమరావతిలో కొనసాగించబోతున్నారు. అమరావతిని ఏరికోరి రాజధానిగా ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీకి ఇది మింగుడు పడని వ్యవహారమే. దీనిపై ఆ పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనే బీటెక్ రవి.

మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదానికి నిరసనగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బీటెక్ రవి లేఖ రాశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమన్నారు. చట్ట సభ అయిన శాసనమండలికి దక్కిన ప్రాధాన్యానికి కలత చెందిన తాను అలాంటి ప్రాధాన్యత లేని సభలో ఉండడం అనవసరంగా భావించి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మండలి ఛైర్మన్‌కు ఫార్మాట్ ప్రకారం రాజీనామాను పంపనున్నట్లు రవి వెల్లడించారు. మరి రవి రాజీనామా లేఖపై చంద్రబాబు ఏమంటారో.. మండలి ఛైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదిస్తారో లేదో చూడాలి.

This post was last modified on July 31, 2020 10:10 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

1 hour ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

1 hour ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

2 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

2 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

2 hours ago

అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి…

2 hours ago