Political News

మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ కంచికి చేరింది. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర్నుంచి పట్టుబట్టి అమరావతి నుంచి రాజధానిని తరలించే విషయంలో వడివడిగా అడుగులు వేసిన జగన్ సర్కారు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ వ్యవస్థ ఈ విషయంలో ఏం చేస్తుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి అయితే రాజధాని అమరావతి నుంచి తరలిపోతున్నట్లే. నామమాత్రంగా శాసన వ్యవస్థను మాత్రమే అమరావతిలో కొనసాగించబోతున్నారు. అమరావతిని ఏరికోరి రాజధానిగా ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీకి ఇది మింగుడు పడని వ్యవహారమే. దీనిపై ఆ పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనే బీటెక్ రవి.

మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదానికి నిరసనగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బీటెక్ రవి లేఖ రాశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమన్నారు. చట్ట సభ అయిన శాసనమండలికి దక్కిన ప్రాధాన్యానికి కలత చెందిన తాను అలాంటి ప్రాధాన్యత లేని సభలో ఉండడం అనవసరంగా భావించి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మండలి ఛైర్మన్‌కు ఫార్మాట్ ప్రకారం రాజీనామాను పంపనున్నట్లు రవి వెల్లడించారు. మరి రవి రాజీనామా లేఖపై చంద్రబాబు ఏమంటారో.. మండలి ఛైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదిస్తారో లేదో చూడాలి.

This post was last modified on July 31, 2020 10:10 pm

Share

Recent Posts

అనిరుధ్‌‌కు పిచ్చెక్కించే ఆంధ్రా మీల్స్‌

అనిరుధ్ రవిచందర్‌ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. అతడికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.…

37 minutes ago

అన్నయ్య సెట్లయ్యాడు… తమ్ముడు హిట్టివ్వాలి

గత పదేళ్లలో గట్టిగా చెప్పుకునే ఒక్క బ్లాక్ బస్టర్ లేక అయితే యావరేజ్ లేదా డిజాస్టర్ తో నెట్టుకుంటూ వస్తున్న…

46 minutes ago

బాబు, లోకేశ్ ల మైండ్ లో చిప్ ఉందా?: జగన్

శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మెగా డీఎస్సీలో అవకతవకలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనమండలిలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి…

2 hours ago

సేవకు గుర్తింపు.. క్యాడర్ ఖుషీ

తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులకు దళవాయి…

3 hours ago

తెలుగు సినిమాను గిల్లుతున్న షారుఖ్ డైరెక్టర్

‘బాహుబలి’ దగ్గర్నుంచి ఉత్తరాదిన తెలుగు సినిమాల ఆధిపత్యం ఎలా సాగుతోందో చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ని తక్కువ అంచనా వేసిన బాలీవుడ్…

4 hours ago

తండ్రి, కొడుకులు ఏపీ చ‌ట్ట‌స‌భ‌ల్లోనే…

తెలుగు రాజ‌కీయాల్లో కుటుంబ రాజ‌కీయాలు కొత్త కాదు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు, భార్య‌భ‌ర్త‌లు కూడా చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాథినిత్యం వ‌హించిన…

5 hours ago