చంద్రగిరిలో ప్రత్యర్ధులు ఫైనల్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది. తనకు బదులు కొడుకు మోహిత్ రెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి చాలాకాలంగా కోరుతున్నారు. ఇంతకాలం ఏమీ చెప్పని జగన్మోహన్ రెడ్డి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంఎల్ఏనే ప్రకటించారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఎంఎల్ఏ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కొడుకు మోహిత్ రెడ్డి ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు చెప్పారు.
విషయం ఏమిటంటే ఎంఎల్ఏకి జగన్ పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించారట. వచ్చే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను సమన్వయం చేసుకునే బాధ్యతలను చెవిరెడ్డికి జగన్ అప్పగించారట. అంటే చెవిరెడ్డికి అప్పగించిన బాధ్యతలను చూస్తుంటే చాలా కీలకమైనదనే అర్ధమవుతోంది. ఒకవైపు ఇంతటి కీలకమైన బాధ్యతలను మోస్తునే మరోవైపు చంద్రగిరిలో పోటీచేయటం తనకు ఇబ్బంది అవుతుందని ఎంఎల్ఏ చెప్పారట.
చెవిరెడ్డి వాదనతో ఏకీభవించిన జగన్ ఆయన స్ధానంలో కొడుకు మోహిత్ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో చెవిరెడ్డి మద్దతుదారులంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మోహిత్ రెడ్డి నియోజకవర్గమంతా పాదయాత్రతో చుట్టేశారు. తండ్రికి బదులుగా కొడుకే నియోజకవర్గంలో మంచి చెడ్డా చూసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా మొహిత్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి నేతలు, క్యాడర్ కు ఎంఎల్ఏ అయినా ఎంఎల్ఏ కొడుకు అయినా పెద్ద తేడా ఏమీ కనబడటం లేదు.
ఇదే సమయంలో టీడీపీ తరపున పులివర్తి నాని పోటీ చేయబోతున్నారు. నానికే పార్టీ టికెట్ ఖాయం చేసిందని నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లో చెవిరెడ్డికి 1,27,790 ఓట్లు వస్తే, నానీకి 86,035 ఓట్లొచ్చాయి. అంటే నానీపై చెవిరెడ్డి 41,755 ఓట్ల మెజారిటితో గెలిచారు. నిజానికి రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నుండి పోటీ చేయటం నానికి ఇష్టం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే బలవంతంగా నానికే లోకేష్ టికెట్ ప్రకటించారని టాక్. మొత్తానికి ప్రధాన పార్టీల తరపున అభ్యర్ధులైతే ఖాయమైపోయారు. ఇక నామినేషన్లు వేయటమే మిగిలింది.
This post was last modified on April 4, 2023 2:53 pm
మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…