2022 డిసెంబరు 9న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పటి నుంచి కేసీఆర్ పొరుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ 12 జెడ్పీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ ఆశలు వదులుకున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. జనవరి 2న కొందరు ఏపీ నేతలు వచ్చి బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఎలాంటి క్రియాశీల కార్యక్రమమూ జరగకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి…
ఏప్రిల్ 3వ వారంలో…
అనుమానాలకు తెరదించుతూ ఏపీ వైపుకు దూసుకుపోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నెల 3వ వారంలో వైజాగ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను మంత్రి శ్రీవివాస యాదవ్ కు అప్పగించినట్లు చెబుతున్నారు. తొలుత విజయవాడలోనే సభ ఏర్పాటు చేయాలని భావించిన ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆలోచన మారినట్లు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వైజాగ్ కేపిటల్ నినాదానికి మద్దతు లేదన్న నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చిందట. దానితో అమరావతి రాజధాని నినాదానికే పరోక్షంగా మద్దతివ్వాలని భావిస్తోందట. విజయవాడ కంటే విశాఖలో సభ పెడితే ఒడిశా నుంచి కూడా కేడర్ ను తీసుకువచ్చే వీలుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ కూడా విశాఖలో సభ పెట్టాలని సూచించినట్లు చెబుతున్నారు…
విశాఖ ఉక్కుకు మద్దతు…
టార్గెట్ వైజాగ్ గా బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్న తరుణంలో ఉక్కు కర్మాగారానికి మద్దతిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆయన వ్యతిరేకిస్తున్నారు. లక్షన్నర కోట్ల కంపెనీని కారు చౌకగా ప్రైవేటుకు అప్పగించే చర్యలను అందరూ వ్యతిరేకించాలని ఆయన కోరుతున్నారు. వర్కింగ్ కేపిటల్ కోసం కేంద్రమే నిధులు విడుదల చేయడంతో పాటు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన అంటున్నారు. పైగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసి వారి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను పార్టీ అధిష్టానం ఆదేశించింది. మరి బీఆర్ఎస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి….
This post was last modified on April 4, 2023 10:53 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…