Political News

అప్పట్లో టీడీపీ మేనిఫెస్టో రాసింది సజ్జలే..

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ అధికార పార్టీలో ఎలాంటి కలకలాన్ని రేపిందన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా వచ్చిన ఫలితాలతో వైసీపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. అన్నింటికి మించి అధినేత మాటకు భిన్నంగా వ్యవహరించిన ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం కావటంతోపాటు.. వారి పై వెనువెంటనే వేటు పడింది కూడా. అలా వేటు పడిన వారిలో సీనియర్ నేత.. నలుగురు సీఎంల వద్ద మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. సౌమ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు కానీ.. అవసరమైతే మాస్ కే మాస్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటంలో ఆనం దూకుడుగా వ్యవహరిస్తుంటారు.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జలను ఎందుకు టార్గెట్ చేశారు? మీ సమస్యంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోకదా? లాంటి ప్రశ్నలకు ఆనం తనదైన రీతిలో బదులిచ్చారు. బయటకు వచ్చి మాట్లడుతున్నది సజ్జలే అని.. ఆయన చెప్పిన మాటల్నే తాము చెబుతున్నట్లుగా పేర్కొన్నారు.

మేం లెక్కలో లేమని సజ్జల చెప్పారు. సస్పెండ్ చేశామని చెప్పింది ఆయనే.ముడుపుల ఆరోపణలు చేసింది ఆయనే. అసలాయన చెబితేనే సజ్జల చేస్తున్నాడని తెలుసు. కాబట్టి సజ్జలను ఖండిస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన పోయి ఆయనకు చెప్పుకోవాలి. ఆయన ఏమైనే చేస్తే చేయించుకోవాలి. గతంలో టీడీపీ మేనిఫెస్టో రాసిందెవరండి? సజ్జల రామక్రిష్ణారెడ్డి తెలుగుదేశం మేనిఫెస్టో రాయలేదా? ఇవాళ వైసీపీలోకి వచ్చి ఇక్కడ మేనిఫెస్టో నేను చూస్తున్నావు అని అంటున్నావు కదా? వైఎస్ ఉన్న రోజుల్లో ఈ సజ్జల టీడీపీ మేనిఫెస్టో రాయలేదా?” అని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం ఎలా అవుతుందని మండిపడ్డారు.

ముడుపులు తీసుకున్నానంటూ తనపై ఆరోపణలు చేసిన సజ్జలపై తాను కోర్టును ఆశ్రయిస్తానని.. పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు ఆనం. ‘సజ్జల మీదనే కోర్టుకు వెళతా. ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను అడిగేది ఒక్కటే. 175 ఓట్లకు 175 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నారు. వారికి 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి అన్ని ఓట్లు వచ్చాయి. మరి.. క్రాస్ ఓటింగ్ ఏముంది? అటునుంచి ఇటు జరిగిందని మీరు చెప్పినప్పుడు ఇటునుంచి అటు కూడా క్రాస్ అయ్యాయా? మీరెన్నిముడుపులు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకున్నారు? మీరెన్ని ఆశలు కల్పించారు” అంటూ ప్రశ్నించారు. తన రాజకీయ మజిలీ ఏమిటన్నది అందరితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు ఆనం.

This post was last modified on April 3, 2023 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

2 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

5 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

6 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

8 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

9 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

9 hours ago