ఔను.. మంచి సమయం మించిన దొరకదు. అంటారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్ర స్తుతం ఏపీలో మంచి సమయం కొనసాగుతోంది. ప్రబుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకునేందుకు.. ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది. బహుశ దీనిని గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఇది పార్టీకి మేలు చేస్తోందనే టాక్ కూడా వినిపి స్తోంది. ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ గ్యాప్ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎక్కడో విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. తాను.. సినిమా షూటింగులకు పరిమితం అయ్యారు.
పోనీ.. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపిస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. తనకు కుదరకపోతే .. ఇతర నేతలను రంగంలోకి దింపి.. పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆయన ఎక్కడా ఎలాంటి వ్యూహంతోనూ ముందుకు సాగడం లేదు. పైగా.. ఇంకేముంది.. వారాహి వాహనాన్ని రంగంలోకి దింపుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే యాత్రలు సాగిస్తానన్నారు. దీంతో పార్టీలోనూ.. అభిమానుల్లోనూ ఆశలు పెల్లుబికాయి.
కానీ, ఇప్పటి వరకు వారాహి.. రంగంలోకి దిగింది లేదు. పోనీ.. ఎప్పుడు రంగంలోకి దిగుతుందనే విషయం పైనా క్లారిటీ లేదు. అంతిమంగా చూస్తే.. జనసేన పార్టీ ఒక వ్యూహం లేని.. ఒక సూత్రం లేని పార్టీగా మిగిలి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారో .. లేక ఎన్నికల వరకు వేచి ఉంటారో చూడాలి.
This post was last modified on April 1, 2023 10:40 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…