జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తుల విషయంలో ఆయన క్లారిటీకి రాలేకపోతున్నారు. అయినా జన సైనికులు మాత్రం నిరాశ పడటం లేదు. ఎన్నికల నాటికి పొత్తులు ఖరారవుతాయన్న విశ్వాసంలో వాళ్లు పనిచేసుకుపోతున్నారు..
పవన్ కల్యాణ్ పై ఏపీలో మాత్రం నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ బలం రెట్టింపయిందని ఆయన విశ్లేషించారు. రెండు మూడు ఇంటర్వ్యూల్లో ఆయన ఇదే మాట చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు ఆరు శాతం ఓట్లు వచ్చాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అది 12 శాతం వరకు పెరిగిందని ఉండవల్లి చెబుతున్నారు. ఎన్నికల నాటికి అది 15 శాతానికి చేరుకున్నా ఆశ్చర్యం లేదని ఉండవల్లి వాదన. గత ఎన్నికల్లో పవన్ పార్టీ ఘోరంగా దెబ్బ తిన్న మాట వాస్తవమేనని అంటూ.. ఇప్పుడు మాత్రం జనంలో జనసేన పట్ల విశ్వాసం బాగా పెరిగిందని చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే అధికార వైసీపీ మట్టి కరవడం ఖాయమని ఉండవల్లి విశ్లేషిస్తున్నారు.
పొత్తులు మోదీ ఇష్టం
పొత్తులపై ఉండవల్లి వింత వాదన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పొత్తు ప్రధాని మోదీ చేతిలో ఉన్నాయని ఆయన అంటున్నారు. జగన్ గెలవాలని మోదీ అనుకుంటే చంద్రబాబు, పవన్ ను విడదీస్తారని లెక్కగడుతున్నారు. అదే జగన్ తో పనేముందిలే ఓడిచ్చేద్దామని అనుకుంటే మాత్రం పవన్ ను చంద్రబాబుతో పొత్తుకు ఒప్పిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే మాత్రం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారడం ఖాయం.
This post was last modified on April 1, 2023 4:58 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…