జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తుల విషయంలో ఆయన క్లారిటీకి రాలేకపోతున్నారు. అయినా జన సైనికులు మాత్రం నిరాశ పడటం లేదు. ఎన్నికల నాటికి పొత్తులు ఖరారవుతాయన్న విశ్వాసంలో వాళ్లు పనిచేసుకుపోతున్నారు..
పవన్ కల్యాణ్ పై ఏపీలో మాత్రం నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ బలం రెట్టింపయిందని ఆయన విశ్లేషించారు. రెండు మూడు ఇంటర్వ్యూల్లో ఆయన ఇదే మాట చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు ఆరు శాతం ఓట్లు వచ్చాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అది 12 శాతం వరకు పెరిగిందని ఉండవల్లి చెబుతున్నారు. ఎన్నికల నాటికి అది 15 శాతానికి చేరుకున్నా ఆశ్చర్యం లేదని ఉండవల్లి వాదన. గత ఎన్నికల్లో పవన్ పార్టీ ఘోరంగా దెబ్బ తిన్న మాట వాస్తవమేనని అంటూ.. ఇప్పుడు మాత్రం జనంలో జనసేన పట్ల విశ్వాసం బాగా పెరిగిందని చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే అధికార వైసీపీ మట్టి కరవడం ఖాయమని ఉండవల్లి విశ్లేషిస్తున్నారు.
పొత్తులు మోదీ ఇష్టం
పొత్తులపై ఉండవల్లి వింత వాదన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పొత్తు ప్రధాని మోదీ చేతిలో ఉన్నాయని ఆయన అంటున్నారు. జగన్ గెలవాలని మోదీ అనుకుంటే చంద్రబాబు, పవన్ ను విడదీస్తారని లెక్కగడుతున్నారు. అదే జగన్ తో పనేముందిలే ఓడిచ్చేద్దామని అనుకుంటే మాత్రం పవన్ ను చంద్రబాబుతో పొత్తుకు ఒప్పిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే మాత్రం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారడం ఖాయం.
This post was last modified on April 1, 2023 4:58 pm
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…