Political News

జ‌గ‌న్‌కు ఆ వర్గాలు దూరమైనట్లేనా?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇన్నాళ్లుగా పెంచి పోషించిన మొక్క‌ను త‌న చేతతో తానే తెంపేసుకుంటున్నారా? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంపై అయితే.. అత్యంత శ్ర‌ద్ధ వ‌హించారో.. ఇప్పుడు అదే విష‌యంపై అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్న‌డూ లేని విధంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీల‌కు కూడా అంతే ప్రాధాన్యం క‌ల్పించారు.

ఇది సీఎం జ‌గ‌న్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు.. గ‌తంలో వైఎస్ హయాం నుంచి కూడా.. అండ‌గా ఉంటున్నార‌నే పేరు ఉండ‌డంతో అది ఇప్పుడు జగ‌న్ కూడా కొన‌సాగించ డంతో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాలు.. 2014, 2019 ఎన్నిక‌ల నుంచి జ‌గ‌న్‌వెంటే న‌డుస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు.. ఒక్క ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం త‌ప్ప‌.. అన్ని చోటా వైసీపీ విజ‌యం ద‌క్కించు కుందంటే.. అది ఖ‌చ్చితంగా ఆయా వ‌ర్గాలు.. సీఎం జ‌గ‌న్ వెనుక ఉన్నాయ‌ని ప్ర‌త్య‌క్షంగా చెప్ప‌డ‌మే.

అయితే.. అలాంటి వ‌ర్గాలు ఇప్పుడు.. కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకిదూరం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తేనె తుట్టె వంటి.. ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేషన్ల వ్య‌వ‌హారాన్ని.. సీఎం జ‌గ‌న్ క‌ద‌పడం.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగ‌డం తెలిసిందే. బోయ‌ల‌ను.. ఎస్టీల్లో చేర్చాల‌ని, వ‌డ్డెర ల‌ను ఎస్సీల్లో చేర్చాల‌ని అదేవిధంగా ద‌ళిత క్రిస్టియ‌న్ల‌ను కూడా ఎస్సీ సామాజిక వ‌ర్గంలో ప్రాధాన్యం క‌ల్పించాల‌ని ఇటీవ‌ల అసెంబ్లీలో తీర్మానం చేశారు.

అయితే..ఆయా వ‌ర్గాల‌కు చెందిన వారు మాత్రం ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ ను క‌ద‌ప‌డానికి వీల్లేద‌ని తేల్చి చెబుతున్నారు. ఇది.. తీవ్ర ఉద్య‌మంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్ని చేసినా.. ఇప్పుడు కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో తేనెతుట్టె వంటి.. రిజ‌ర్వే షన్ విష‌యాన్ని క‌ద‌ప‌డం వ‌ల్ల‌.. మేలు క‌న్నా.. కీడే ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

2 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

6 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

6 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago