పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీని జెడ్ స్పీడులో లోక్ సభ సచివాలయం అనర్హుడిగా ప్రకటించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేసినప్పటికీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఎనిమిదేళ్ల పాటు రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఉద్యమించాయి.
పార్లమెంట్ కు నల్లదుస్తులతో వస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తొందరపడిందని చెబుతున్నా వినిపించుకునేందుకు సిద్ధంగా లేరు. అనర్హత వేటుకు సంబంధించిన ఇప్పుడు మరో ఎంపీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఒక కేసులో లక్షదీవుల ఎంపీ ఫైజల్ కు శిక్షపడటంతో లోక్ సభ సచివాలయం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది.
పైగా దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఫైజల్ కు విధించిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించినా కూడా అనర్హతను ఉపసంహరించుకోలేదు. ఆయన లోక్ సభకు రాసిన లేఖను కూడా పట్టించుకోలేదు. లోక్ సభ సచివాలయం వైఖరిపై ఫైజల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.
ఆయన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనితో లోక్ సభ సచివాలయం దిగివచ్చింది. ఫైజల్ అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఫైజల్ కేసు లాంటిదే రాహుల్ కేసు కూడా కావడంతో ఆయన అనర్హతను కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదీ రాహుల్ హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఉపసంహరిస్తారా… లేక ముందే ఉపసంహరిస్తారో చూడాలి.
This post was last modified on March 29, 2023 7:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…