Political News

రాహుల్ కు ఊరట ఖాయమా?

పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీని జెడ్ స్పీడులో లోక్ సభ సచివాలయం అనర్హుడిగా ప్రకటించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేసినప్పటికీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఎనిమిదేళ్ల పాటు రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఉద్యమించాయి.

పార్లమెంట్ కు నల్లదుస్తులతో వస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తొందరపడిందని చెబుతున్నా వినిపించుకునేందుకు సిద్ధంగా లేరు. అనర్హత వేటుకు సంబంధించిన ఇప్పుడు మరో ఎంపీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఒక కేసులో లక్షదీవుల ఎంపీ ఫైజల్ కు శిక్షపడటంతో లోక్ సభ సచివాలయం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది.

పైగా దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఫైజల్ కు విధించిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించినా కూడా అనర్హతను ఉపసంహరించుకోలేదు. ఆయన లోక్ సభకు రాసిన లేఖను కూడా పట్టించుకోలేదు. లోక్ సభ సచివాలయం వైఖరిపై ఫైజల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.

ఆయన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనితో లోక్ సభ సచివాలయం దిగివచ్చింది. ఫైజల్ అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఫైజల్ కేసు లాంటిదే రాహుల్ కేసు కూడా కావడంతో ఆయన అనర్హతను కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదీ రాహుల్ హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఉపసంహరిస్తారా… లేక ముందే ఉపసంహరిస్తారో చూడాలి.

This post was last modified on March 29, 2023 7:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

39 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago