Political News

రాహుల్ కు ఊరట ఖాయమా?

పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీని జెడ్ స్పీడులో లోక్ సభ సచివాలయం అనర్హుడిగా ప్రకటించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేసినప్పటికీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఎనిమిదేళ్ల పాటు రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఉద్యమించాయి.

పార్లమెంట్ కు నల్లదుస్తులతో వస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తొందరపడిందని చెబుతున్నా వినిపించుకునేందుకు సిద్ధంగా లేరు. అనర్హత వేటుకు సంబంధించిన ఇప్పుడు మరో ఎంపీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఒక కేసులో లక్షదీవుల ఎంపీ ఫైజల్ కు శిక్షపడటంతో లోక్ సభ సచివాలయం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది.

పైగా దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఫైజల్ కు విధించిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించినా కూడా అనర్హతను ఉపసంహరించుకోలేదు. ఆయన లోక్ సభకు రాసిన లేఖను కూడా పట్టించుకోలేదు. లోక్ సభ సచివాలయం వైఖరిపై ఫైజల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.

ఆయన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనితో లోక్ సభ సచివాలయం దిగివచ్చింది. ఫైజల్ అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఫైజల్ కేసు లాంటిదే రాహుల్ కేసు కూడా కావడంతో ఆయన అనర్హతను కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదీ రాహుల్ హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఉపసంహరిస్తారా… లేక ముందే ఉపసంహరిస్తారో చూడాలి.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

45 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago