కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ అధినేతగా మారినా కూడా తన ఫాంహౌస్ను, హైదరాబాద్ను వదిలి దూరం వెళ్లడం లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాలను మార్చేస్తానంటున్న ఆయన దేశ రాజధాని దిల్లీ వెళ్లేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. అక్కడ తమ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పనులు జోరుగా సాగుతున్నా… తనతో కలిసి నడుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో శాంతిభద్రతల సమస్య తలెత్తినా అటువైపు చూడడం లేదు.. దేశ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు.
జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కలలు కంటున్న కేసీఆర్ దిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతారని.. దిల్లీలో కూర్చుని ఇతర పార్టీల నేతలను కలుస్తారని, మేధావులతో సమావేశాలు నిర్వహిస్తారని.. మీడియాతో మాట్లాడుతారని చాలామంది అనుకున్నారు. కానీ… ఆయన మాత్రం అటువైపే చూడడం లేదు. కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవడంతో దిల్లీలో ఆమె హడావుడే ఎక్కువగా కనిపించింది.. ఆ నేపథ్యంలో కేసీఆర్ కనుక దిల్లీ వస్తే ఆ ప్రభావం బీఆర్ఎస్పై పడుతుందన్న భయంతోనే ఆయన దిల్లీ వైపు చూడడం లేదని సమాచారం.
గతంలో కేసీఆర్ దిల్లీ వస్తే నాలుగైదు రోజులు ఉండేవారు. ఆయన చివరిసారిగా డిసెంబర్ 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం వచ్చారు. అనంతరం మళ్లీ రాలేదు. ప్రస్తుత పరిస్థితులలో దిల్లీ వస్తే లిక్కర్ కేసుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయని.. మీడియాతో మాట్లాడడం కష్టమని భావించే ఆయన మొహం చాటేస్తున్నట్లు చెప్తున్నారు.
లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి మనీశ్ సిసోడియా కూడా అరెస్ట్ కావడం… ఆమ్ ఆద్మీ పార్టీతో తమకు మంచి అవగాహన ఉండడం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. దిల్లీ వెళ్తే కేజ్రీవాల్ను కలవాల్సి ఉంటుంది. కేంద్రంలోనిబీజేపీతో పోరాడుతానంటున్న బీఆర్ఎస్ పార్టీ అధినేతగా దిల్లీ వెళ్తే ఇతర పార్టీల నేతలను కలవాల్సిఉంటుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితులలో అది ఏమంత సరైన నిర్ణయం కాదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ దిల్లీ వెళ్లకుండా హైదరాబాద్కు పరిమితం అవుతున్నట్లు చెప్తున్నారు.
This post was last modified on March 23, 2023 12:51 pm
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…