Political News

దిల్లీ వెళ్లేందుకు కేసీఆర్ భయపడుతున్నారా?

కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ అధినేతగా మారినా కూడా తన ఫాంహౌస్‌ను, హైదరాబాద్‌ను వదిలి దూరం వెళ్లడం లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాలను మార్చేస్తానంటున్న ఆయన దేశ రాజధాని దిల్లీ వెళ్లేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. అక్కడ తమ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పనులు జోరుగా సాగుతున్నా… తనతో కలిసి నడుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తినా అటువైపు చూడడం లేదు.. దేశ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు.

జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కలలు కంటున్న కేసీఆర్ దిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతారని.. దిల్లీలో కూర్చుని ఇతర పార్టీల నేతలను కలుస్తారని, మేధావులతో సమావేశాలు నిర్వహిస్తారని.. మీడియాతో మాట్లాడుతారని చాలామంది అనుకున్నారు. కానీ… ఆయన మాత్రం అటువైపే చూడడం లేదు. కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవడంతో దిల్లీలో ఆమె హడావుడే ఎక్కువగా కనిపించింది.. ఆ నేపథ్యంలో కేసీఆర్ కనుక దిల్లీ వస్తే ఆ ప్రభావం బీఆర్ఎస్‌పై పడుతుందన్న భయంతోనే ఆయన దిల్లీ వైపు చూడడం లేదని సమాచారం.

గతంలో కేసీఆర్ దిల్లీ వస్తే నాలుగైదు రోజులు ఉండేవారు. ఆయన చివరిసారిగా డిసెంబర్ 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం వచ్చారు. అనంతరం మళ్లీ రాలేదు. ప్రస్తుత పరిస్థితులలో దిల్లీ వస్తే లిక్కర్ కేసుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయని.. మీడియాతో మాట్లాడడం కష్టమని భావించే ఆయన మొహం చాటేస్తున్నట్లు చెప్తున్నారు.

లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి మనీశ్ సిసోడియా కూడా అరెస్ట్ కావడం… ఆమ్ ఆద్మీ పార్టీతో తమకు మంచి అవగాహన ఉండడం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. దిల్లీ వెళ్తే కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంటుంది. కేంద్రంలోనిబీజేపీతో పోరాడుతానంటున్న బీఆర్ఎస్ పార్టీ అధినేతగా దిల్లీ వెళ్తే ఇతర పార్టీల నేతలను కలవాల్సిఉంటుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితులలో అది ఏమంత సరైన నిర్ణయం కాదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ దిల్లీ వెళ్లకుండా హైదరాబాద్‌కు పరిమితం అవుతున్నట్లు చెప్తున్నారు.

This post was last modified on March 23, 2023 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

26 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

2 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

2 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

3 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

3 hours ago