Movie News

అక్టోబర్ వద్దంటున్న మహేష్ ఫ్యాన్స్

అనుకుంటాం కానీ ఇండస్ట్రీలో ఉన్నన్ని సెంటిమెంట్లు ఇంకెక్కడా ఉండవేమో. కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగినా వాటి మధ్య ఉన్న సంబంధం ఎన్నో అనుమానాలు రేకెత్తించి భయపడేలా చేస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఆగస్ట్ 11 విడుదలవుతుందా లేదానే దాని మీద ఎలాంటి క్లారిటీ రావడం లేదు. నిన్న ఉగాది పండగ సందర్భంగా టైటిల్ కాకపోయినా కనీసం రిలీజ్ డేట్ కి సంబంధించి మరోసారి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందేమోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ అదేమీ జరగలేదు.

సోషల్ మీడియా ట్రెండింగ్ దెబ్బకు త్వరలో అప్ డేట్స్ ఉంటాయని మొన్న ట్వీట్ చేయడం తప్పించి ఇంకేమి చెప్పలేదు. ఈలోగా చిరంజీవి భోళాశంకర్ అదే తేదీని లాక్ చేసుకుని అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. అనిమల్, గదర్ 2, జైలర్ ఇలా ఆ వారంలో చాలా పెద్ద పోటీనే ఉంది. అందుకే మహేష్ 28ని అక్టోబర్ లో దసరా పండగ సందర్భంగా తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో టీమ్ ఉన్నట్టు వినికిడి. అయితే మహేష్ మాత్రం ఆ సీజన్ మీద ఏమంత ఆసక్తి చూపించడం లేదట. ఇదే కాంబోలో రూపొందిన ఖలేజా ఆ టైంలోనే వచ్చి ఫ్లాప్ మూటగట్టుకోవాల్సి వచ్చింది

ఇదొక్కటే కాదు బాబీ , అతిథి, వంశీ ఇదే నెలలో రిలీజై సూపర్ డిజాస్టర్స్ గా నిలిచాయి. సో రకంగా అక్టోబర్ ఏ మాత్రం అచ్చిరాని నెలగా ఫీలవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. త్రివిక్రం బృందం మాత్రం ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. 2024 సంక్రాంతి ఆప్షన్ ఉన్నప్పటికీ ప్రభాస్ ప్రాజెక్ట్ కె, రామ్ చరణ్ సిఈఓలు ఉన్న నేపథ్యంలో వాటితో తలపడి ఓపెనింగ్స్ ని పరస్పరం దెబ్బ తీసుకోవడం కంటే ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందేమో చూస్తున్నారట. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు

This post was last modified on March 23, 2023 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

7 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

8 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

9 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

9 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

9 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

10 hours ago