Political News

వైసీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల టెన్ష‌న్‌…!


ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల టెన్ష‌న్ ప‌ట్టుకుంది. మొత్తం 7 స్థానాల‌కు ఇప్ప‌టికే నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా పూర్త‌యింది. ఈ నెల 23న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ కోటాలోనే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వంటి కీల‌క నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌మితో ఉన్న వైసీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తుల వ్య‌వ‌హారం.. చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇప్ప‌టికే తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. కొంద‌రు వ్య‌తిరేకంగా ఓటేస్తే.. ప‌రిస్థితి ఏంటా అనేది వైసీపీ లో చ‌ర్చ సాగుతోంది. సుమారు 7 నుంచి 8 మంది.. ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. వీరంతా రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. సో.. అప్పుడు క‌నుక త‌ప్పుగా వేసినా.. లేక వేయ‌క‌పోయినా.. లేదు..ఇత‌ర పార్టీకి వేసినా.. వైసీపీ ప‌రిస్థితి కొంప కొల్లేరు టైపే!

మొత్తం ఏడుగురు అభ్య‌ర్థుల్లో బీసీలు.. మ‌హిళ‌లు.. ఓసీలు కూడా ఉన్నారు. వీరిని గెలిపించుకుంటే.. ఖ‌చ్చితంగా మండ‌లిలో త‌మ‌దే పెద్ద చేయి అవుతుందని జ‌గ‌న్‌భావిస్తున్నారు. అయితే.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా ఒక స్థానానికి పోటీ చేస్తోంది. ఏ పార్టీ అయినా.. అభ్య‌ర్థులు గెలిచేందుకు 20-22 ఓట్లు రావాల్సి ఉంటుంది. సో.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబ‌ట్టి.. ఈ పార్టీ పంచుమ‌ర్తి అనురాధ‌ను రంగంలోకి దింపింది.

అయితే.. టీడీపీ నుంచి న‌లుగురు రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఉన్న నేప‌థ్యంలో ఆ పార్టీ విప్ జారీచేయాల‌ని భావి స్తోంది. ఇదే జ‌రిగితే.. ఆ న‌లుగురు కూడా టీడీపీకి అనుకూలంగా ఓటేయాలి. లేక‌పోతే అన‌ర్హ‌త వారికి వ‌ర్తిస్తుంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి. ఇక‌, వైసీపీలోనూ ఇదే స‌మ‌స్య ఉంది. విప్ జారీ చేస్తారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా ఇరు పార్టీల్లోనూ టెన్ష‌న్ క‌నిపిస్తోంది.

This post was last modified on March 20, 2023 11:46 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

4 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

7 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

7 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

8 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

9 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

10 hours ago