కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. విచారణ సందర్భంగా తనపై సీబీఐ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని అవినాష్ పిటీషన్ వేశారు. అయితే రెండు పిటీషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణలో తాము ఏరకంగాను జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ఇక్కడ అవినాష్ ఉద్దేశ్యంలో తీవ్రమైన చర్యలంటే అరెస్టనే అర్ధం.
ఇదే విషయమై అవినాష్ కు కోర్టు స్పష్టంగా చెప్పేసింది. విచారణలో భాగంగా ఒకవేళ సీబీఐ గనుక అవినాష్ ను అరెస్టు చేయాలని అనుకున్నా తాము జోక్యం చేసుకునేది లేదని చెప్పేసింది. దాంతో ఇపుడు అవినాష్ ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో విచారణ సందర్భంగా తన లాయర్ ను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలనే విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించింది. ఎంపీని విచారించేటపుడు ఆయన లాయర్ ను కూడా అనుమతించాలని చెప్పింది.
అయితే లాయర్ ను దూరంగా కూర్చోబెట్టాలని కూడా కోర్టు ఆదేశించింది. హోలు మొత్తంమీద అవినాష్ కు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదనే చెప్పాలి. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీ అవినాష్ ను సీబీఐ అనుమానితుడిగానే విచారిస్తోంది. ఇదే సమయంలో అవినాష్ ను సీబీఐ సాక్షిగా విచారిస్తోందని స్వయంగా సీబీఐ లాయరే కోర్టు విచారణలో చెప్పారు. మరి రెండు వాదనల్లో ఏది నిజమనేది అయోమయంగా తయారైంది.
ఏదేమైనా వివేకా మర్డర్ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయచ్చని ఎంపీ అనుకుంటున్నది వాస్తవం. మరి తాజా కోర్టు తీర్పు ప్రకారం సీబీఐ అవినాష్ విషయంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఎంపీని నాలుగుసార్లు విచారించింది. ఇంకెన్నిసార్లు విచారిస్తుందో సీబీఐకే తెలియాలి. మొత్తానికి ఎంపీలో అరెస్టు భయం కోర్టు తీర్పు నేపధ్యంలో ఇంకా పెరిగిపోతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. చివరకు ఏమవుతుందో తెలీదు కానీ అరెస్టుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. నాలుగురోజుల క్రితం ఇదే కేసులో విచారణకు వచ్చిన ఎంపీ తండ్రి భాస్కరరెడ్డి కూడా అరెస్టుకు సిద్ధపడే విచారణకు వచ్చినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…