కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. విచారణ సందర్భంగా తనపై సీబీఐ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని అవినాష్ పిటీషన్ వేశారు. అయితే రెండు పిటీషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణలో తాము ఏరకంగాను జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ఇక్కడ అవినాష్ ఉద్దేశ్యంలో తీవ్రమైన చర్యలంటే అరెస్టనే అర్ధం.
ఇదే విషయమై అవినాష్ కు కోర్టు స్పష్టంగా చెప్పేసింది. విచారణలో భాగంగా ఒకవేళ సీబీఐ గనుక అవినాష్ ను అరెస్టు చేయాలని అనుకున్నా తాము జోక్యం చేసుకునేది లేదని చెప్పేసింది. దాంతో ఇపుడు అవినాష్ ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో విచారణ సందర్భంగా తన లాయర్ ను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలనే విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించింది. ఎంపీని విచారించేటపుడు ఆయన లాయర్ ను కూడా అనుమతించాలని చెప్పింది.
అయితే లాయర్ ను దూరంగా కూర్చోబెట్టాలని కూడా కోర్టు ఆదేశించింది. హోలు మొత్తంమీద అవినాష్ కు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదనే చెప్పాలి. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీ అవినాష్ ను సీబీఐ అనుమానితుడిగానే విచారిస్తోంది. ఇదే సమయంలో అవినాష్ ను సీబీఐ సాక్షిగా విచారిస్తోందని స్వయంగా సీబీఐ లాయరే కోర్టు విచారణలో చెప్పారు. మరి రెండు వాదనల్లో ఏది నిజమనేది అయోమయంగా తయారైంది.
ఏదేమైనా వివేకా మర్డర్ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయచ్చని ఎంపీ అనుకుంటున్నది వాస్తవం. మరి తాజా కోర్టు తీర్పు ప్రకారం సీబీఐ అవినాష్ విషయంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఎంపీని నాలుగుసార్లు విచారించింది. ఇంకెన్నిసార్లు విచారిస్తుందో సీబీఐకే తెలియాలి. మొత్తానికి ఎంపీలో అరెస్టు భయం కోర్టు తీర్పు నేపధ్యంలో ఇంకా పెరిగిపోతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. చివరకు ఏమవుతుందో తెలీదు కానీ అరెస్టుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. నాలుగురోజుల క్రితం ఇదే కేసులో విచారణకు వచ్చిన ఎంపీ తండ్రి భాస్కరరెడ్డి కూడా అరెస్టుకు సిద్ధపడే విచారణకు వచ్చినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
This post was last modified on March 17, 2023 11:44 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…