కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. విచారణ సందర్భంగా తనపై సీబీఐ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని అవినాష్ పిటీషన్ వేశారు. అయితే రెండు పిటీషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణలో తాము ఏరకంగాను జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ఇక్కడ అవినాష్ ఉద్దేశ్యంలో తీవ్రమైన చర్యలంటే అరెస్టనే అర్ధం.
ఇదే విషయమై అవినాష్ కు కోర్టు స్పష్టంగా చెప్పేసింది. విచారణలో భాగంగా ఒకవేళ సీబీఐ గనుక అవినాష్ ను అరెస్టు చేయాలని అనుకున్నా తాము జోక్యం చేసుకునేది లేదని చెప్పేసింది. దాంతో ఇపుడు అవినాష్ ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో విచారణ సందర్భంగా తన లాయర్ ను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలనే విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించింది. ఎంపీని విచారించేటపుడు ఆయన లాయర్ ను కూడా అనుమతించాలని చెప్పింది.
అయితే లాయర్ ను దూరంగా కూర్చోబెట్టాలని కూడా కోర్టు ఆదేశించింది. హోలు మొత్తంమీద అవినాష్ కు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదనే చెప్పాలి. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీ అవినాష్ ను సీబీఐ అనుమానితుడిగానే విచారిస్తోంది. ఇదే సమయంలో అవినాష్ ను సీబీఐ సాక్షిగా విచారిస్తోందని స్వయంగా సీబీఐ లాయరే కోర్టు విచారణలో చెప్పారు. మరి రెండు వాదనల్లో ఏది నిజమనేది అయోమయంగా తయారైంది.
ఏదేమైనా వివేకా మర్డర్ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయచ్చని ఎంపీ అనుకుంటున్నది వాస్తవం. మరి తాజా కోర్టు తీర్పు ప్రకారం సీబీఐ అవినాష్ విషయంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఎంపీని నాలుగుసార్లు విచారించింది. ఇంకెన్నిసార్లు విచారిస్తుందో సీబీఐకే తెలియాలి. మొత్తానికి ఎంపీలో అరెస్టు భయం కోర్టు తీర్పు నేపధ్యంలో ఇంకా పెరిగిపోతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. చివరకు ఏమవుతుందో తెలీదు కానీ అరెస్టుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. నాలుగురోజుల క్రితం ఇదే కేసులో విచారణకు వచ్చిన ఎంపీ తండ్రి భాస్కరరెడ్డి కూడా అరెస్టుకు సిద్ధపడే విచారణకు వచ్చినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
This post was last modified on March 17, 2023 11:44 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…