Political News

అనురాధ విజయం ఖాయమా ?

వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని చోట్ల గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారు. పార్టీ నేతలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ప్రత్యర్థులు ఊరుకుంటారా. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా.. అభ్యర్థిని రంగంలోకి దించారు. ఇప్పుడు అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంతకీ ఏమిటా ఎన్నికలు అనే కదా అనుమానం. అవే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఒక సీటు గెలిచే అవకాశం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు పాచిక వేసేశారు. పంచుమర్తి అనురాధను రంగంలోకి దించారు..

రెబెల్స్ ఎటు ?

ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరుగుతుంది. ఏడు స్థానాలకూ వైసీపీ అభ్యర్థులు రంగంలోకి దిగడంతో, టీడీపీ కూడా ఒక అభ్యర్థిని పోటీ చేయిస్తోంది. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకే ఓటేస్తారని టీడీపీ విశ్వాసం. పైగా తమకు కొందరు రహస్య స్నేహితులు కూడా ఉన్నారని టీడీపీ చెప్పుకుంటోంది. వైసీపీ కూడా పార్టీ మారిన వారిపైనే ఆశలతోనే అన్ని చోట్ల అభ్యర్థులను నిలిపింది.

ఫిరాయింపుదారులే కీలకం

అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీ మొత్తం ఏడు స్థానాల్లో గెలవలంటే తలా 25 ఓట్లు రావాలి. లేనిపక్షంలో ప్రాధాన్య ఓటు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలుండటంతో పార్టీ అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి 21 ఓట్లు లభిస్తాయి. మరో నలుగురు అభ్యర్థులకు మరో ఓటు అదనంగా వేయించవచ్చు. అంటే నలుగురికి 22 ఓట్లు, ముగ్గురుకు ఇరవై ఒక్క ఓట్లు పార్టీ పంచుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే… వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కన్నా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు లెక్క. కానీ ఆ పార్టీకి ఉన్న సమస్య నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించడం. టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ వైసీపీలో చేరిపోయారు. అలాగే జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకే మద్దతుగా నిలిచారు. అంటే అనధికారికంగా టీడీపీకి 19 ఓట్లే వస్తాయనుకోవాలి.

విప్ తోనే ఇబ్బందులు

ఎన్నికల్లో ఫలానా అభ్యర్థికి ఓటెయ్యాలని పార్టీలు విప్ జారీ చేసే అవకాశం ఉంది. అలా విప్ జారీ చేసిన పక్షంలో ప్రత్యర్థులకు ఓటేస్తే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను కోరే అవకాశం కూడా ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే అనర్హత వేటు అన్నది ఒక సుదీర్ఘ ప్రక్రియ. స్పీకర్ నిదానంగా స్పందించిన పక్షంలో చేయగలిగిందేమీ లేకపోవచ్చు. దానితో ఈ లోపు ఎన్నికలే వచ్చేస్తాయి. అనర్హత వేటు వేస్తే ఎంత వేయకపోతే ఎంత..

చంద్రబాబు చాణక్యం !

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగానే అనురాధను రంగంలోకి దించారని భావిస్తున్నారు. ఆమె ఓడిపోతే బీసీ మహిళను జగన్ ఓడించారని ప్రచారం చేసే వీలుంటుంది. అయితే వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని అందరికీ తెలుసు. అందులో కొందరైనా క్రాస్ ఓటింగ్ చేస్తే అనురాధ గెలుపు ఖాయమవుతుంది. ఆమె విజయం సాధిస్తే భవిష్యత్తులో మైండ్ గేమ్ ఆడేందుకు ఈ ఫలితం ఉపయోగపడుతుంది.

This post was last modified on March 16, 2023 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

19 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

39 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago