వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలున్నందున హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని అవినాష్ హైకోర్టలో వేసిన పిటిషన్ కు న్యాయస్థానం స్పందించకపోవడంతో నాలుగోసారి ఆయన హాజరు కావాల్సి వచ్చింది నాలుగున్నర గంటల విచారణ తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు.
గురువారం మళ్లీ..
అవినాష్ ఇంటికి వెళ్లిపోయి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఆయనకు నోటీసులు అందాయి. గురువారం హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. హాజరు నుంచి మినహాయింపు విషయంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో ఆయన విధిగా హాజరు కావాల్సిన అనివార్యత ఏర్పడింది. దానితో గురువారం సీబీఐ తీరు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
వరుసగా మూడు సార్లు అవినాష్ మీడియాతో మాట్లాడటంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. దానితో ఇప్పుడు ఏం జరిగిన ఆయన మౌనం వహించాల్సిందే.. పైగా సీబీఐ అధికారులపై అవినాష్ చాలా ఆరోపణలు కూడా చేశారు. మరో పక్క ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఎప్పుడు విచారిస్తారో ఇంకా తెలియరాలేదు. భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరైనప్పుడు సీబీఐ అధికారులే రాలేదు.
This post was last modified on March 16, 2023 9:59 am
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…