వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలున్నందున హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని అవినాష్ హైకోర్టలో వేసిన పిటిషన్ కు న్యాయస్థానం స్పందించకపోవడంతో నాలుగోసారి ఆయన హాజరు కావాల్సి వచ్చింది నాలుగున్నర గంటల విచారణ తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు.
గురువారం మళ్లీ..
అవినాష్ ఇంటికి వెళ్లిపోయి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఆయనకు నోటీసులు అందాయి. గురువారం హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. హాజరు నుంచి మినహాయింపు విషయంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో ఆయన విధిగా హాజరు కావాల్సిన అనివార్యత ఏర్పడింది. దానితో గురువారం సీబీఐ తీరు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
వరుసగా మూడు సార్లు అవినాష్ మీడియాతో మాట్లాడటంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. దానితో ఇప్పుడు ఏం జరిగిన ఆయన మౌనం వహించాల్సిందే.. పైగా సీబీఐ అధికారులపై అవినాష్ చాలా ఆరోపణలు కూడా చేశారు. మరో పక్క ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఎప్పుడు విచారిస్తారో ఇంకా తెలియరాలేదు. భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరైనప్పుడు సీబీఐ అధికారులే రాలేదు.
This post was last modified on March 16, 2023 9:59 am
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…