వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలున్నందున హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని అవినాష్ హైకోర్టలో వేసిన పిటిషన్ కు న్యాయస్థానం స్పందించకపోవడంతో నాలుగోసారి ఆయన హాజరు కావాల్సి వచ్చింది నాలుగున్నర గంటల విచారణ తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు.
గురువారం మళ్లీ..
అవినాష్ ఇంటికి వెళ్లిపోయి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఆయనకు నోటీసులు అందాయి. గురువారం హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. హాజరు నుంచి మినహాయింపు విషయంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో ఆయన విధిగా హాజరు కావాల్సిన అనివార్యత ఏర్పడింది. దానితో గురువారం సీబీఐ తీరు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
వరుసగా మూడు సార్లు అవినాష్ మీడియాతో మాట్లాడటంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. దానితో ఇప్పుడు ఏం జరిగిన ఆయన మౌనం వహించాల్సిందే.. పైగా సీబీఐ అధికారులపై అవినాష్ చాలా ఆరోపణలు కూడా చేశారు. మరో పక్క ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఎప్పుడు విచారిస్తారో ఇంకా తెలియరాలేదు. భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరైనప్పుడు సీబీఐ అధికారులే రాలేదు.
This post was last modified on March 16, 2023 9:59 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…