నెల్లూరు వైసీపీలో వింతలు జరుగుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బజారున పడి తిట్టుకుంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన రెబెల్ స్టార్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనిల్ ఇలాకాలో హల్ చల్ చేసేందుకు కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు.
శ్రీధర్ రెడ్డిపై సీరియస్
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం సీరియస్గా ఉంది. పార్టీ నుంచి పూర్తిగా వైదొలగకుండా ఆయన నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం చెందుతోంది. పార్టీకి పూర్తిగా దూరమైన ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
గిరిధర్ రెడ్డి సస్పెన్షన్
తాజాగా శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. రాష్ట్ర సేవాదళ్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించింది. బాధ్యతలు అప్పగించిన కొద్ది నెలలకే ఆ పదవి నుంచి తొలగించారు.
నిజానికి శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత గిరిధర్ను ప్రోత్సహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. నెల్లూరు రూరల్ టికెట్ కూడా ఆయనకే ఇవ్వాలని భావించిందట. అయితే గిరిధర్ రెడ్డి అధిష్టానం ఆలోచనను అమలు చేయకుండా అన్నయ్య శ్రీధర్ రెడ్డి బాటలో నడుస్తున్నారట. దానితో ఆగ్రహించిన అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసింది.
కామెడీ టైమ్
తాజా సస్పెన్షన్ వైసీపీ వర్గాల్లోనే కామెడీలకు అవకాశం ఇచ్చింది. పార్టీని వదిలేసి దూరంగా జరిగిన వారిని ప్రత్యేకంగా సస్పెండ్ చేయడమేంటని కొందరు జోకులేసుకుంటున్నారు. అంతా జగన్మాయ అని చెప్పుకుంటున్నారు..
This post was last modified on March 13, 2023 8:49 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…