గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చే నిజమైంది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి త్వరలోనే బీజేపీలోకి చేరతారంటూ.. పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన బీజేపీలోకి చేరతారో.. లేదో.. లైన్ క్లియరైందో లేదో.. అనే సందేహాలు మాత్రం వెంటాడాయి. తాజాగా దీనికి కూడా ఒక స్పష్టత వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. తాజాగా నల్లారి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను నల్లారి కిరణ్కుమార్రెడ్డి పంపించారు. కేవలం ఒకే ఒక వాక్యం పేర్కొన్నారు. “కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను దయచేసి ఆమోదించగలరు” అని మాత్రమే ఆయన రాశారు. ఇక, ఇతర కారణాలేవీ కూడా పేర్కొనలేదు. దీంతో ఆయన రాజీనామా ఖరారైనట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. బీజేపీలో నల్లారికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేతలు టచ్లో ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి గతంలోనూ ఇలాంటి చర్చే జరిగినా.. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్చేపట్టిన జోడో యాత్రకు కూడా నల్లారి దూరంగా ఉండడంతో ప్రస్తుత చర్చపై ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరేందుకు కిరణ్కుమార్రెడ్డి రెడీ అయిపోయారని తాజా రాజీనామా స్పష్టం చేస్తోంది. అయితే.. ఆయనను తెలంగాణలో ని పార్టీలోకి తీసుకుంటారా? లేక.. కేంద్రంలో బాధ్యతలు అప్పగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించిన ఆయన.. విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. అయితే ఎవరూ గెలవలేదు. దీంతో సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఏపీసీసీ సమన్వయకమిటీ సభ్యునిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్కు రాజీనామా చేయడం గమనార్హం.
This post was last modified on March 12, 2023 10:27 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…