కల్వకుంట్ల కవితపై కేసుతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వైరం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఎవరెంత అవినీతి చేశారనే చర్చ కూడా జోరందుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారిస్తున్న తరుణంలోనే హైదరాబాద్లో కొన్ని పోస్టర్లు, ఫ్లెక్సీలు హల్ చల్ చేస్తున్నాయి.
ED, CBI బిజెపి బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ పలువురు నేతల ఫోటోలు ఆ పోస్టర్లలో దర్శనమిస్తున్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు CBI, ED రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ వెలిసిన ఫ్లెక్సీలను జనం ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బిజెపి నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు కనిపిస్తున్నాయి.
కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్ కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లలో రాతలు కనిపిస్తున్నాయి. పైగా నిజమైన రంగులు వెలిసిపోవూ అంటూ కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి. చివర్లో చివర్లో బై బై మోదీ అంటూ హాష్ టాగ్ తో పోస్టర్లు ఉండటంతో జనానికి తెగ ఇంట్రస్ట్ పుట్టేస్తోంది.
This post was last modified on March 11, 2023 11:04 am
స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు…
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…