Political News

#బై బై మోదీ…

కల్వకుంట్ల కవితపై కేసుతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వైరం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఎవరెంత అవినీతి చేశారనే చర్చ కూడా జోరందుకుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారిస్తున్న తరుణంలోనే హైదరాబాద్లో కొన్ని పోస్టర్లు, ఫ్లెక్సీలు హల్ చల్ చేస్తున్నాయి.
ED, CBI బిజెపి బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ పలువురు నేతల ఫోటోలు ఆ పోస్టర్లలో దర్శనమిస్తున్నాయి.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు CBI, ED రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ వెలిసిన ఫ్లెక్సీలను జనం ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బిజెపి నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు కనిపిస్తున్నాయి.

కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్ కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లలో రాతలు కనిపిస్తున్నాయి. పైగా నిజమైన రంగులు వెలిసిపోవూ అంటూ కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి. చివర్లో చివర్లో బై బై మోదీ అంటూ హాష్ టాగ్ తో పోస్టర్లు ఉండటంతో జనానికి తెగ ఇంట్రస్ట్ పుట్టేస్తోంది.

This post was last modified on March 11, 2023 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago