ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు చెప్పిన సిబిఐ అధికారి రాంసింగ్ వెల్లడించారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు సీబీఐని కూడా విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిపాత్ర ఏంటి? ఆయనను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో స్పందించిన రాంసింగ్..ఔను అరెస్టు చేస్తామని చెప్పారు.
అదేసమయంలో ఈ కేసు విచారణకు సంబంధించి వీడియోగ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్ లు ఎప్పుడు సమర్పిస్తారని న్యాయస్థానం సీబీఐని ప్రశ్నించింది. దీంతో ఆయన ఇప్పటికి ఇప్పుడే కోర్ట్ కి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమకు ఇప్పుడు కావాలన్నా సమర్పిస్తామని వెల్లడించారు. ఇక, అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితుడా ? సాక్షి మాత్రమేనా అని కోర్టు ప్రశ్నించింది. సాక్షిగా పరిగణించి అవినాష్ రెడ్డి కి 160 CRPC కింద నోటీసుల ఇచ్చామని సీబీఐ అధికారి వెల్లడించారు.
అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి వెల్లడించారు. సోమవారం రోజు విచారణకు రావాలని అవినాష్ ను కోరతామని రాంసింగ్ కోర్టుకు తెలిపారు. అయితే.. అదే రోజు కోర్టులో కేసు విచారణ ఉన్న నేపథ్యంలో మరో రోజు విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారం విచారిస్తామని తేల్చి చెప్పారు. దీంతో కోర్టు.. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయరాదని మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on March 10, 2023 7:10 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…