వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు వ్యతిరేకంగా మారడం ఖాయమని, ఉద్యోగులు ఆశించినవి ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చడం లేదని.. విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇప్పటి వరకు వైసీపీనాయకులు పెదవి విప్పి కామెంట్లు చేయలేదు. కానీ, తాజాగా డిప్యూటీ స్పీకర్, విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఔను.. ఉద్యోగులు మాకు వచ్చే ఎన్నికల్లో వేటు వేస్తారని ఎలా అనుకుంటాం. వాళ్లు అనుకున్నవి మేం చేయలేదు. మేం ఇచ్చినవి తీసుకున్నారుగా! కాబట్టి వేసేవారు కూడా ఉంటారని అనుకుంటున్నాం. ఒక వేళ వేయకపోయినా.. మాకు నష్టం లేదు. మళ్లీ మాకు మహిళలు, బీసీలు అండగా ఉంటారు. అధికారంలోకి వస్తాం. ఈ విషయంలో క్లారిటీతోనే ఉన్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంలో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ తరపున కోలగట్ల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆశిస్తోందన్నారు. అయితే.. కొందరు కొండంత కోరుకుంటారని.. కొండంతా వారికే ఇచ్చేస్తే.. ఇతరులకు ఏం ఇవ్వాలని ప్రశ్నించారు. “నాకు కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని ఉంటుంది. ఇది సాధ్యమేనా?” అంటూ..ఉద్యోగులపై పరోక్షంగా మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు ఆకర్షితులుగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంలో పట్టభద్రులు కూడా మద్దతుగా నిలిచి సీతం రాజు సుధాకర్ ను గెలిపించాలని కోలగట్ల కోరారు.
This post was last modified on March 5, 2023 11:19 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…