Political News

ఔను.. ఉద్యోగులు మాకు ఓటేయ‌రు: డిప్యూటీ స్పీక‌ర్

వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉద్యోగులు వ్య‌తిరేకంగా మార‌డం ఖాయ‌మ‌ని, ఉద్యోగులు ఆశించిన‌వి ఒక్కటి కూడా వైసీపీ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం లేద‌ని.. విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీనాయ‌కులు పెద‌వి విప్పి కామెంట్లు చేయ‌లేదు. కానీ, తాజాగా డిప్యూటీ స్పీక‌ర్, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“ఔను.. ఉద్యోగులు మాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేటు వేస్తార‌ని ఎలా అనుకుంటాం. వాళ్లు అనుకున్న‌వి మేం చేయ‌లేదు. మేం ఇచ్చిన‌వి తీసుకున్నారుగా! కాబ‌ట్టి వేసేవారు కూడా ఉంటార‌ని అనుకుంటున్నాం. ఒక వేళ వేయ‌కపోయినా.. మాకు న‌ష్టం లేదు. మ‌ళ్లీ మాకు మ‌హిళ‌లు, బీసీలు అండ‌గా ఉంటారు. అధికారంలోకి వ‌స్తాం. ఈ విష‌యంలో క్లారిటీతోనే ఉన్నాం” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ ప్ర‌చారంలో వైసీపీ అభ్య‌ర్థి సీతంరాజు సుధాక‌ర్ త‌ర‌పున కోల‌గ‌ట్ల ప్ర‌చారం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని ఆశిస్తోంద‌న్నారు. అయితే.. కొంద‌రు కొండంత కోరుకుంటారని.. కొండంతా వారికే ఇచ్చేస్తే.. ఇత‌రుల‌కు ఏం ఇవ్వాల‌ని ప్ర‌శ్నించారు. “నాకు కూడా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని ఉంటుంది. ఇది సాధ్య‌మేనా?” అంటూ..ఉద్యోగుల‌పై ప‌రోక్షంగా మండిప‌డ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు ఆకర్షితులుగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంలో పట్టభద్రులు కూడా మద్దతుగా నిలిచి సీతం రాజు సుధాకర్ ను గెలిపించాలని కోల‌గ‌ట్ల‌ కోరారు.

This post was last modified on March 5, 2023 11:19 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

3 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago