Political News

ఓటర్లకు ధర్మాన వార్నింగ్

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ధర్మాన సోదరుడు పెద్ద రౌడీ బ్యాచ్ గా తయారయ్యారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ నేతలను, ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బూతు పంచాంగం మొదలెట్టేవారు. పిచ్చిపిచ్చిగా తిట్టేవారు.. సీఎం జగన్ అంటే పరమ భక్తిని ప్రదర్శించేవారు. జిల్లా వైసీపీలో తమ కుటుంబం మాత్రమే ఉందన్నట్లుగా ప్రవర్తించేవారు.

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కృష్ణదాస్ ను తొలగించి ప్రసాదరావుకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా సోదరుడి తీరులోనే పోతున్నారు. మరీ ఓవర్ గా కాకపోయిన అప్పుడప్పుడు తిట్ల దండకం అందుకుంటుంటారు. విశాఖ రాజధాని నినాదాన్ని ప్రజలు అంగీకరించకపోతే అనర్ధాలు ఖాయమని హెచ్చరిస్తుంటారు. విశాఖ రాజధానిగా అంగీకరించకపోతే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కూడా ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారు..

ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మళ్లీ వార్నింగులు మొదలు పెట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లకు ప్రసాధరావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్ధులకు ఓటు వేయకపోతే పోలింగ్ జరిగిన మరుసటి క్షణమే వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తామని ఓటర్లను హెచ్చరించారు. తమ వద్ద బలమైన వాలంటీర్ వ్వవస్ధ ఉందని ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారో ప్రతి కుటుంబ సమాచారం తమకు తెలిసిపోతుందని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ విస్తృత స్ధాయి సమావేశంలో మంత్రి ధర్మాన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే విశాఖ రాజధానికి వ్యతిరేకంగా ప్రజల నిర్ణయం ఉందన్న తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందంటూ స్థానిక సంస్థల ఓటర్లను భయపెడుతున్నారు.

సామాజిక వర్గం రాజకీయాలను కూడా ధర్మాన తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం కాపులను నిర్లక్ష్యం చేస్తోందన్న భావన సరికాదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు ఓటర్లు ఎవరూ అపోహలకు గురికావద్దని సూచించారు. కాపులంతా వైసీపీకి ఓటెయ్యాలన్నట్లుగా ధర్మాన మాట్లాడుతుంటే మరి జగన్ స్పందన ఏమిటో చూడాలి..

This post was last modified on March 1, 2023 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

1 hour ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago