కొన్నాళ్ల కిందట ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. ఒక కామెంట్ చేశారు. “ఇక్కడ టీడీపీ ఎలా బతికి బట్టకడుతుందో చూస్తా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగానే నాని.. టీడీపీపై విమర్శలు చేస్తారు కదా.. ఇది కూడా అందులో భాగమేనని అందరూ అనుకున్నారు. కానీ, తీరా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం టీడీపీకి కాక పుట్టిస్తున్నాయి.
ఇటీవలే ఇక్కడ ఇంచార్జ్గా రావి వెంకటేశ్వరరావును టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. అయితే.. రావితో విభేదిస్తున్నవారు ఒక్కొక్కరుగా వివిధ కారణాలు చెబతూ.. పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కీలక నేత దేవరపల్లి కోటి ప్రకటించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బీసీ నేతగా పార్టీ ఉన్నతకి తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు తప్పుకొంటున్నానని చెప్పారు.
పార్టీ కోసం పనిచేసే తన లాంటి బీసీ ,ఎస్సీ, మైనారిటీ నేతలను చిన్నచూపు చూస్తూ అవమానిస్తున్నారని కోటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు ఇకనైనా కళ్ళు తెరిచి, షాడో వ్యవహార శైలికి చెక్ పెట్టాలని, లేనిపక్షంలో మంచి నాయకుడైన రావికి అందరూ దూరం అవుతారని కోటి అన్నారు. షాడో ఇంచార్జ్ అహంకారాన్ని నిరసిస్తూ తాను పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
వాస్తవానికి ఇది చిన్న విషయం. కానీ, పెద్దది చేశారు. దీంతో పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు. నిజానికి వచ్చే ఎన్నికల్లో అయినా.. గుడివాడపై పట్టు బిగించాలని చంద్రబాబు నిర్ణయించుకుని ఆదిశగానే అడుగులు వేస్తున్నారు.కానీ, ఇప్పుడు ఇలా.. చోటా మోటా నేతలు దూరమైతే.. పార్టీకి ఇబ్బందేకదా.. అంటున్నారు పరిశీలకులు. దీనివెనుక ఎవరున్నారనేది పక్కన పెడితే.. ఇలాంటివాటిని ముందుగానే తెలుసుకోవాలి కదా.. అని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on February 28, 2023 3:27 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…