Political News

10 ఎమ్మెల్యే-2 ఎంపీ స్థానాల్లో.. జ‌న‌సేన దూకుడు!

ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం వ‌చ్చేసింది. ఎవ‌రికి వారు త‌మ త‌మ గ్రాఫ్‌ను స‌రిచూసుకుంటున్నారు. మ‌రి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ్రాఫ్ ఎలా ఉంది? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏయే జిల్లాల్లో ఎంత మేర‌కు స‌త్తా నిరూపించుకోనున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యాల‌పైనే కొంద‌రు చేసిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. ప‌వ‌న్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాల్సిందేన‌ని.. ఈ స‌ర్వే తేల్చ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు..అస‌లు నాయ‌కులే లేని పార్టీ అంటూ.. ఎక్కువ‌గా ప్ర‌జ‌లు పేర్కొన్నారు. మ‌రీ ముఖ్యంగా.. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతే.. త‌మ క‌ష్టాలు ఎవ‌రికి చెప్పుకోవాలి? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. స‌రే.. ఇవ‌న్నీ కామన్‌గా ఎప్పుడూ ఉన్న‌వే. ప‌వ‌న్ అంతే! ఎప్పుడో ఆయ‌న‌కు కాల్ షీట్ వీలున్న‌ప్పుడు వ‌స్తున్నారు. అయితే.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. రెండు పార్ల‌మెంటు స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని తేల‌డం గ‌మ‌నార్హం.

ఒక‌టి అన‌కాప‌ల్లి… రెండు కాకినాడ‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. మెజారిటీ ప్ర‌జ‌లు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్‌కు సై అంటున్నారు. ఒక‌టి విశాఖ‌లో ఉండ‌గా.. రెండోది ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిజిల్లాలో ఉంది. రెండు చోట్ల కూడా కాపుల డామినేష‌న్ క‌నిపిస్తోంది. ఇక‌, ఈ సారి న‌ర‌సాపురంలో జ‌న‌సేన పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని తేలింది. అదేవిధంగా విజ‌యవాడ ప‌శ్చిమ‌, గుంటూరు వెస్ట్‌, స‌త్తెన‌ప‌ల్లి, క‌ర్నూలు, పాణ్యం వంటి నియోక‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన దూకుడుగానే ఉంద‌ని తెలిసింది.

ఇక‌, ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌భావం కూడా బాగానే ఉన్నా.. సీట్ల సంఖ్య‌పై మాత్రం క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం జ‌రిగిన స‌ర్వే అంతా కూడా.. న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమితం అయింది. గ్రామీణ స్థాయిలో ఎలా ఉంద‌నేది తేలాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో మాత్రం జ‌న‌సేన దూకుడుగా ఉన్న‌ట్టు తేలింది. ప‌వ‌న్ క‌నుక పుంజుకుంటే.. ఈ గ్రాఫ్ పెరుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 28, 2023 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

20 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago