Political News

మార్చురీ నిండిపోయింది… కారణమే విచిత్రం

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే….తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి. అదే తరహాలో కరోనా…కరోనా…నువ్వేం చేస్తావు అంటే…కరోనా అనుమానితులు, కరోనా నుంచి కోలుకున్నవారినీ అంటరానివారిలా చూసేలా చేస్తాను…కరోనా నుంచి కోలుకున్న తల్లిదండ్రులను, తోబుట్టువులను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేలా చేస్తాను…కన్నవారి కడసారి చూపులకన్నా….తన ప్రాణాలు ఎక్కువనేలా చేస్తాను….అన్నీ ఉన్నా అనాథ శవాల్లాగా అంత్యక్రియలు జరపాల్సిన దుస్థితిని….కనీసం కరోనాతో చనిపోయిన వారు తమ రక్తసంబంధీకులను చెప్పుకోకుండా బ్రతికేలా చేస్తాను…అని అంటుందేమో.

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే జనాల్లోని మానవత్వపు స్థాయిలో గణనీయంగా మార్పులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనన్న ఆవేదన పలువురిని కలచివేస్తోంది. తాజాగా, గుంటూరు జనరల్ హస్పిటల్ మార్చురీలోని దయనీయ పరిస్థితులు కరోనా వల్ల జరుగుతోన్న దారుణాలకు పరాకాష్ట అని చెప్పవచ్చు.

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలతో జీజీహెచ్ మార్చురీ నిండిపోయింది. ఆ శవాలు తమ బంధువులవేనని చెప్పేవారు కరువయ్యారు. దీంతో, ఆ శవాల ఖననం వైద్య, ఆరోగ్య, మునిసిపల్, పోలీసు సిబ్బందికి తలకు మించిన భారమైంది.

కరోనా సోకి చనిపోయిన తమ వారి మృతదేహలనే దూరంగా చూసి…అంత్యక్రియల్లో పాల్గొనలేని పరిస్థితి కొందరిది. అయితే, కరోనా సోకి చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని అనాథ శవంలా మార్చురీలో వదిలేసి వెళుతున్న దారుణ మనస్తత్వం మరికొందరిది. గుంటూరు జీజీహెచ్ లో కరోనా సోకి చనిపోయిన వారు కొందరైతే….చనిపోయిన తర్వాత కరోనా అని నిర్ధారణ అయిన వారు మరికొందరు. అయితే, ఇలా చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరుస్తున్నారు.
అయితే, వాటిని తీసుకువెళ్లేందుకు రోగి వెంట వచ్చిన కుటుంబీకులు, బంధువులు ముందుకు రావడం లేదు. ఆ మృతదేహలను అనాథ శవాలుగా వదిలేసి వారి దారిన వారు వెళ్లిపోతున్నారు. దీంతో, క్రమంలో జిజిహెచ్‌ మార్చురీలో ఈ తరహాలో వదిలేసిన 40 దాకా మృతదేహలు ఉన్నాయి. ఆ మృతదేహల అంత్యక్రియలు నిర్వహిస్తేనే మార్చురీ ఖాళీ అవుతుంది.

పీపీఈ కిట్లతో మునిసిపల్ , వైద్య సిబ్బంది, కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు…వాటిని ఖననం చేయక తప్పని పరిస్థితి. అయితే, గుంటూరు కార్పొరేషన్‌లో కరోనా పాజిటివ్‌తో మృతిచెందిన వారిలో రోజుకు నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. చాలా శ్మశాన వాటికల్లో స్థానికులు అభ్యంతరం తెలపడంతో…..జాప్యం జరుగుతోంది. దీంతో, ఈ విషయాన్ని గుంటూరు కలెక్టర్ దృష్టికి ఆసుపత్రి వర్గాలు తీసుకు వెళ్లాయి. వాటి ఖననంపై ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నాయి.

Satya

Recent Posts

తెలుగు కుర్రాడికి రజినీ సినిమాలో ఛాన్స్

తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…

7 hours ago

ఓజీ-2: పవన్ మారాలి… సుజీతూ మారాలి

అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…

8 hours ago

రెహమాన్ కంబ్యాక్ జరిగిందా లేదా

పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…

10 hours ago

నా చేతులు నా ఇష్టం అంటే చేతులు విరుగుతాయి

ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…

11 hours ago

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13…

11 hours ago

వారణాసి మాట మార్చే ఛాన్స్ లేనట్టే

రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…

11 hours ago