Political News

మార్చురీ నిండిపోయింది… కారణమే విచిత్రం

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే….తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి. అదే తరహాలో కరోనా…కరోనా…నువ్వేం చేస్తావు అంటే…కరోనా అనుమానితులు, కరోనా నుంచి కోలుకున్నవారినీ అంటరానివారిలా చూసేలా చేస్తాను…కరోనా నుంచి కోలుకున్న తల్లిదండ్రులను, తోబుట్టువులను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేలా చేస్తాను…కన్నవారి కడసారి చూపులకన్నా….తన ప్రాణాలు ఎక్కువనేలా చేస్తాను….అన్నీ ఉన్నా అనాథ శవాల్లాగా అంత్యక్రియలు జరపాల్సిన దుస్థితిని….కనీసం కరోనాతో చనిపోయిన వారు తమ రక్తసంబంధీకులను చెప్పుకోకుండా బ్రతికేలా చేస్తాను…అని అంటుందేమో.

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే జనాల్లోని మానవత్వపు స్థాయిలో గణనీయంగా మార్పులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనన్న ఆవేదన పలువురిని కలచివేస్తోంది. తాజాగా, గుంటూరు జనరల్ హస్పిటల్ మార్చురీలోని దయనీయ పరిస్థితులు కరోనా వల్ల జరుగుతోన్న దారుణాలకు పరాకాష్ట అని చెప్పవచ్చు.

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలతో జీజీహెచ్ మార్చురీ నిండిపోయింది. ఆ శవాలు తమ బంధువులవేనని చెప్పేవారు కరువయ్యారు. దీంతో, ఆ శవాల ఖననం వైద్య, ఆరోగ్య, మునిసిపల్, పోలీసు సిబ్బందికి తలకు మించిన భారమైంది.

కరోనా సోకి చనిపోయిన తమ వారి మృతదేహలనే దూరంగా చూసి…అంత్యక్రియల్లో పాల్గొనలేని పరిస్థితి కొందరిది. అయితే, కరోనా సోకి చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని అనాథ శవంలా మార్చురీలో వదిలేసి వెళుతున్న దారుణ మనస్తత్వం మరికొందరిది. గుంటూరు జీజీహెచ్ లో కరోనా సోకి చనిపోయిన వారు కొందరైతే….చనిపోయిన తర్వాత కరోనా అని నిర్ధారణ అయిన వారు మరికొందరు. అయితే, ఇలా చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరుస్తున్నారు.
అయితే, వాటిని తీసుకువెళ్లేందుకు రోగి వెంట వచ్చిన కుటుంబీకులు, బంధువులు ముందుకు రావడం లేదు. ఆ మృతదేహలను అనాథ శవాలుగా వదిలేసి వారి దారిన వారు వెళ్లిపోతున్నారు. దీంతో, క్రమంలో జిజిహెచ్‌ మార్చురీలో ఈ తరహాలో వదిలేసిన 40 దాకా మృతదేహలు ఉన్నాయి. ఆ మృతదేహల అంత్యక్రియలు నిర్వహిస్తేనే మార్చురీ ఖాళీ అవుతుంది.

పీపీఈ కిట్లతో మునిసిపల్ , వైద్య సిబ్బంది, కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు…వాటిని ఖననం చేయక తప్పని పరిస్థితి. అయితే, గుంటూరు కార్పొరేషన్‌లో కరోనా పాజిటివ్‌తో మృతిచెందిన వారిలో రోజుకు నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. చాలా శ్మశాన వాటికల్లో స్థానికులు అభ్యంతరం తెలపడంతో…..జాప్యం జరుగుతోంది. దీంతో, ఈ విషయాన్ని గుంటూరు కలెక్టర్ దృష్టికి ఆసుపత్రి వర్గాలు తీసుకు వెళ్లాయి. వాటి ఖననంపై ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నాయి.

Satya

Recent Posts

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

24 minutes ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

1 hour ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

3 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

4 hours ago

అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!

టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…

4 hours ago