దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాల పాటు ముందుండి నడిపిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందని పేర్కొన్నారు.
మూడు రోజుల పార్టీ ప్లీనరీలో 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అయిందన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నార ని.. భారత్ జోడో యాత్రగా రుజువైనట్లు సోనియా తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం లో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపునిచ్చారు.
అయితే.. సోనియా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. అదేసమయంలో పార్టీలోనూ ఆమె తనదైన శైలిలో వ్యవహరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తరచుగా ముఖ్యమంత్రుల ను మార్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి.. నేతలకు స్వేచ్ఛ కల్పించారు. అంతేకాదు.. ఉపాధి హామీ వంటి కీలకమైన పథకాలను తీసుకువచ్చారు. ఆధార్ వంటి వ్యవస్థను కూడా తీసుకురావడంలో సోనియా తనదైన దూకుడుతో ముందుకు వెళ్లారు.
అయితే.. ఎక్కడా కూడా ప్రభుత్వంలో ప్రత్యక్ష పాత్ర పోషించని సోనియా.. తెరవెనుక మాత్రం అన్నీ తానై వ్యవహరించడం గమనార్హం. అదేసమయంలో ఇతర పార్టీలను కలుపుకొని.. యూపీఏ సర్కారును సమర్థవంతంగా పదేళ్ల పాటు పాలించేలా ముందుండి.. వ్యూహ రచన కూడా చేసిన ఘనత సోనియాకు మాత్రమే దక్కుతుంది.
This post was last modified on February 25, 2023 3:05 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…