దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాల పాటు ముందుండి నడిపిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందని పేర్కొన్నారు.
మూడు రోజుల పార్టీ ప్లీనరీలో 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అయిందన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నార ని.. భారత్ జోడో యాత్రగా రుజువైనట్లు సోనియా తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం లో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపునిచ్చారు.
అయితే.. సోనియా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. అదేసమయంలో పార్టీలోనూ ఆమె తనదైన శైలిలో వ్యవహరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తరచుగా ముఖ్యమంత్రుల ను మార్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి.. నేతలకు స్వేచ్ఛ కల్పించారు. అంతేకాదు.. ఉపాధి హామీ వంటి కీలకమైన పథకాలను తీసుకువచ్చారు. ఆధార్ వంటి వ్యవస్థను కూడా తీసుకురావడంలో సోనియా తనదైన దూకుడుతో ముందుకు వెళ్లారు.
అయితే.. ఎక్కడా కూడా ప్రభుత్వంలో ప్రత్యక్ష పాత్ర పోషించని సోనియా.. తెరవెనుక మాత్రం అన్నీ తానై వ్యవహరించడం గమనార్హం. అదేసమయంలో ఇతర పార్టీలను కలుపుకొని.. యూపీఏ సర్కారును సమర్థవంతంగా పదేళ్ల పాటు పాలించేలా ముందుండి.. వ్యూహ రచన కూడా చేసిన ఘనత సోనియాకు మాత్రమే దక్కుతుంది.
This post was last modified on February 25, 2023 3:05 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…