టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయా త్ర మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి చేసుకోనుంది. అయితే.. ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. నారా లోకేష్ ఈ యాత్ర ద్వారా ఇప్పటి వరకు 20 పెద్ద పెద్ద హామీలనేగుప్పించారు. అది కూడా ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం లోకేష్ యాత్ర.. చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతోంది. శ్రీకాళహస్తి వరకు ఆయన చేరుకున్నారు.
మరి. ఈ ఒక్క జిల్లాలోనే ఇన్ని హామీలు గుప్పిస్తే.. మరో 12 ఉమ్మడి జిల్లాల్లో ఆయన యాత్ర సాగాల్సి ఉంది. దీంతో ఈ హామీల జాబితా ఇంకెంత పెరుగుతుందో అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. అందిన కాడికి హామీ ఇచ్చుకుంటూ పోతే రేపు వాటిని అమలు చేయకపోతే.. మైనస్ అయిపోమా? అనేది వీరి టాక్ ఇది .. కూడా నిజమే. గత పాదయాత్రలో జగన్. కూడా ఇలా అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఇప్పటికీ.. కొన్నింటిని అమలు చేయలేక చేతులు ఎత్తేశారు.
ఇప్పుడు కూడా లోకేష్కు ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీలోసీనియర్లు చెవులు కొరుక్కుం టున్నారు. పైగా.. ఇది..హామీల యాత్ర కాదనే విషయాన్ని వారు చెబుతున్నారు. యువతను పార్టీవైపు బలంగా తిప్పుకోవాలనే సంకల్పంతో చేపట్టిన యాత్రగా చెబుతున్నారు. ఈ కీలక సూత్రాన్ని విడిచిపెట్టి .. హామీలపై పడితే.. మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.
ఇక, లోకేష్ ఇచ్చిన 20 హామీల్లో కీలకమైనవి చూస్తే..
This post was last modified on February 25, 2023 11:10 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…