టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయా త్ర మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి చేసుకోనుంది. అయితే.. ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. నారా లోకేష్ ఈ యాత్ర ద్వారా ఇప్పటి వరకు 20 పెద్ద పెద్ద హామీలనేగుప్పించారు. అది కూడా ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం లోకేష్ యాత్ర.. చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతోంది. శ్రీకాళహస్తి వరకు ఆయన చేరుకున్నారు.
మరి. ఈ ఒక్క జిల్లాలోనే ఇన్ని హామీలు గుప్పిస్తే.. మరో 12 ఉమ్మడి జిల్లాల్లో ఆయన యాత్ర సాగాల్సి ఉంది. దీంతో ఈ హామీల జాబితా ఇంకెంత పెరుగుతుందో అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. అందిన కాడికి హామీ ఇచ్చుకుంటూ పోతే రేపు వాటిని అమలు చేయకపోతే.. మైనస్ అయిపోమా? అనేది వీరి టాక్ ఇది .. కూడా నిజమే. గత పాదయాత్రలో జగన్. కూడా ఇలా అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఇప్పటికీ.. కొన్నింటిని అమలు చేయలేక చేతులు ఎత్తేశారు.
ఇప్పుడు కూడా లోకేష్కు ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీలోసీనియర్లు చెవులు కొరుక్కుం టున్నారు. పైగా.. ఇది..హామీల యాత్ర కాదనే విషయాన్ని వారు చెబుతున్నారు. యువతను పార్టీవైపు బలంగా తిప్పుకోవాలనే సంకల్పంతో చేపట్టిన యాత్రగా చెబుతున్నారు. ఈ కీలక సూత్రాన్ని విడిచిపెట్టి .. హామీలపై పడితే.. మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.
ఇక, లోకేష్ ఇచ్చిన 20 హామీల్లో కీలకమైనవి చూస్తే..
This post was last modified on February 25, 2023 11:10 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…