టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయా త్ర మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి చేసుకోనుంది. అయితే.. ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. నారా లోకేష్ ఈ యాత్ర ద్వారా ఇప్పటి వరకు 20 పెద్ద పెద్ద హామీలనేగుప్పించారు. అది కూడా ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం లోకేష్ యాత్ర.. చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతోంది. శ్రీకాళహస్తి వరకు ఆయన చేరుకున్నారు.
మరి. ఈ ఒక్క జిల్లాలోనే ఇన్ని హామీలు గుప్పిస్తే.. మరో 12 ఉమ్మడి జిల్లాల్లో ఆయన యాత్ర సాగాల్సి ఉంది. దీంతో ఈ హామీల జాబితా ఇంకెంత పెరుగుతుందో అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. అందిన కాడికి హామీ ఇచ్చుకుంటూ పోతే రేపు వాటిని అమలు చేయకపోతే.. మైనస్ అయిపోమా? అనేది వీరి టాక్ ఇది .. కూడా నిజమే. గత పాదయాత్రలో జగన్. కూడా ఇలా అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఇప్పటికీ.. కొన్నింటిని అమలు చేయలేక చేతులు ఎత్తేశారు.
ఇప్పుడు కూడా లోకేష్కు ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీలోసీనియర్లు చెవులు కొరుక్కుం టున్నారు. పైగా.. ఇది..హామీల యాత్ర కాదనే విషయాన్ని వారు చెబుతున్నారు. యువతను పార్టీవైపు బలంగా తిప్పుకోవాలనే సంకల్పంతో చేపట్టిన యాత్రగా చెబుతున్నారు. ఈ కీలక సూత్రాన్ని విడిచిపెట్టి .. హామీలపై పడితే.. మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.
ఇక, లోకేష్ ఇచ్చిన 20 హామీల్లో కీలకమైనవి చూస్తే..
This post was last modified on February 25, 2023 11:10 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…