తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం ఒకటి తెరమీదకు వచ్చింది. మేథావిగా ముద్రపడ్డ మాజీ ఐఏఎస్ అధికారి, ఓ దఫా ఎమ్మెల్యేగా సేవలు అందించిన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గురించి ఈ వార్త. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ తమ్ముడు నాగేంద్రబాబు తాజాగా బీజేపీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఈ మేరకు బీజేపీ కండువాను నాగేంద్రబాబు మెడలో వేశారు. దీంతో తర్వాత చేరబోయేది జేపీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గత కొద్దికాలంగా దేశంలోని మేధావి వర్గం, బుద్ధిజీవులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనను, బీజేపీ విధానాలను నిశితంగా విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు మోడీ చర్యలను సమర్థిస్తున్నారు. ఇందులో తెలుగు నేలకు చెందిన వారున్నారు. అలాంటి వారిలో జేపీ ఒకరు అనే టాక్ ఆయన వివిధ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న సమయంలో వ్యక్తమవుతోంది. అయితే, ఈ చర్చపై ఇటు బీజేఏపీ తరఫున కానీ అటు లోక్సత్తా జేపీ తరఫున కానీ ఎలాంటి స్పందన/ ప్రకటన వెలువడలేదు.
ఇదిలాఉంటే, తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చేతుల మీదుగా లోక్సత్తా జేపీ సోదరుడు నాగేంద్రబాబు కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఆయనతో పాటుగా పలువురు భావసారుప్య వ్యక్తులు సైతం ఈ మేరకు పార్టీలో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ వెల్లడించిన వెంటనే, సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. త్వరలో చేరబోయేది జేపీనే, ఇప్పటికే ఆయన ఈ మేరకు మొగ్గుచూపుతున్న విషయం అర్థమవుతోంది అంటూ పేర్కొంటున్నారు. ఈ విషయంలో నిజం తెలియాలంటే, మనం కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…