తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం ఒకటి తెరమీదకు వచ్చింది. మేథావిగా ముద్రపడ్డ మాజీ ఐఏఎస్ అధికారి, ఓ దఫా ఎమ్మెల్యేగా సేవలు అందించిన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గురించి ఈ వార్త. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ తమ్ముడు నాగేంద్రబాబు తాజాగా బీజేపీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఈ మేరకు బీజేపీ కండువాను నాగేంద్రబాబు మెడలో వేశారు. దీంతో తర్వాత చేరబోయేది జేపీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గత కొద్దికాలంగా దేశంలోని మేధావి వర్గం, బుద్ధిజీవులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనను, బీజేపీ విధానాలను నిశితంగా విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు మోడీ చర్యలను సమర్థిస్తున్నారు. ఇందులో తెలుగు నేలకు చెందిన వారున్నారు. అలాంటి వారిలో జేపీ ఒకరు అనే టాక్ ఆయన వివిధ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న సమయంలో వ్యక్తమవుతోంది. అయితే, ఈ చర్చపై ఇటు బీజేఏపీ తరఫున కానీ అటు లోక్సత్తా జేపీ తరఫున కానీ ఎలాంటి స్పందన/ ప్రకటన వెలువడలేదు.
ఇదిలాఉంటే, తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చేతుల మీదుగా లోక్సత్తా జేపీ సోదరుడు నాగేంద్రబాబు కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఆయనతో పాటుగా పలువురు భావసారుప్య వ్యక్తులు సైతం ఈ మేరకు పార్టీలో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ వెల్లడించిన వెంటనే, సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. త్వరలో చేరబోయేది జేపీనే, ఇప్పటికే ఆయన ఈ మేరకు మొగ్గుచూపుతున్న విషయం అర్థమవుతోంది అంటూ పేర్కొంటున్నారు. ఈ విషయంలో నిజం తెలియాలంటే, మనం కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
This post was last modified on February 17, 2023 9:55 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…