Political News

మొబైళ్లకు స్టిక్కర్లా? ఎమ్మెల్యేలకు పచ్చబొట్లు వేయండి

రోటీన్ కు భిన్నంగా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పేరుంది. రాష్ట్రం అప్పుల కుప్పలా మారి.. ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి రోజు జీతాలు ఇవ్వలేని దైన్య పరిస్థితుల్లోనూ.. సంక్షేమ కార్యక్రమాల్ని బటన్ నొక్కి మరీ లబ్థిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల్ని పంపించే సీఎంగా ఆయన పేరు గడించారు. తన పాలనకు వేరే వారు మార్కులు వేయటం ఏమిటి? మనమే వేసుకుందామన్నట్లుగా ఆయన తీరు ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందే అన్న పాటలోని మాటను బలంగా నమ్మారేమో కానీ.. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇంచుమించు అదే ధోరణిలో ఉండటం గమనార్హం. ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో స్టిక్కర్లను తయారు చేయించి..రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అతికిస్తున్న జగన్ ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసి.. మొబైల్ ఫోన్ల వెనుక కూడా అదే తరహాలో చిన్న స్టిక్కర్లను తయారు చేయించి.. అతికించే ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావటంతో జనసేన స్పందించింది.

ఇదెక్కడి పిచ్చి అంటూ ఆ పార్టీ మండిపడింది. “ముఖ్యమంత్రి జగన్ కు పబ్లిసిటి పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. ముఖ్యమంత్రి తన ప్రచారం కోసం ఇంటింటికీ స్టిక్కర్లు అంటించాలి. మన మొబైళ్ల మీద ఆయన ఫోటోలు వేయాలని ఆదేశించటం ఆశ్చర్యం కలిగిస్తోంది” అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.

మన మొబైళ్లకు ఆయన స్టిక్కర్లు ఎందుకు వేయించుకోవటమన్న ఆయన.. “ముఖ్యమంత్రి ముందుగా తన మంత్రులు.. ఎమ్మెల్యేలకు పచ్చబొట్లు వేయించి ప్రజల్లోకి పంపాలి. ఆయనకు వారి మీద నమ్మకం లేదు కాబట్టి మేం వైసీపీ వాళ్లం. జగనన్నకు తోడుగా ఉంటాం. ఆయనంటే మాకుభరోసా అన్న మాటలు చెప్పిస్తే బాగుంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. జగన్ సర్కారు వారి మొబైళ్ల వెనుక స్టిక్కర్లు వేయించే కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి.. దీనిపై జగన్ సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.

This post was last modified on February 14, 2023 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago