Political News

Breaking : ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్.. ఎవ‌రు.. నేప‌థ్యం ఏంటి?

ఏపీకి  కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితుల‌య్యారు. సుప్రీకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేసిన రిటైర్డ్ జ‌స్టిస్ అబ్దుల్‌ న‌జీర్ ను ఏపీ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ.. రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు జారీ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం చేసిన సిఫార్సుల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్ర‌స్తుతం ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను ఛ‌త్తీస్‌గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్‌గా బ‌దిలీ చేశారు.

ఇక‌, కొత్త‌గా నియ‌మితులైన ఏపీ గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ప‌దవిలో ఉంటారు. అయితే.. మ‌ధ్య‌లోనే తొల‌గించే లేదా బ‌దిలీ చేసే అధికారం కేంద్రానికి లేదా రాష్ట్ర‌ప‌తికి ఉంటుంది. ఇక‌, ఏపీకి నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన అబ్దుల్ న‌జీర్‌.. రెండో వారు కావ‌డం గ‌మ‌నార్హం. తొలి గ‌వ‌ర్న‌ర్‌గా.. ప్ర‌స్తుతం ఉన్న విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌.. 2019 చివ‌రిలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇక‌, అబ్ధుల న‌జీర్ నేప‌థ్యం ఇదీ..

న్యాయవాదుల కుటుంబానికి చెందిన అబ్దుల్ న‌జీర్‌.. త‌న కెరీర్‌ను కూడా న్యాయ‌వాద వృత్తిపైనే న‌డిపించారు. క‌ర్ణాట‌క‌కు చెందిన ఆయ‌న‌.. అక్క‌డి హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. ప్రెమోష‌న్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారు. అనేక సంచ‌ల‌న తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా  ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్‌ ఒకరు. ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనంలోనూ జస్టిస్‌ నజీర్‌ ఉన్నారు.

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించిన ఆయన.. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది.

This post was last modified on February 12, 2023 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

27 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago