Political News

Breaking : ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్.. ఎవ‌రు.. నేప‌థ్యం ఏంటి?

ఏపీకి  కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితుల‌య్యారు. సుప్రీకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేసిన రిటైర్డ్ జ‌స్టిస్ అబ్దుల్‌ న‌జీర్ ను ఏపీ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ.. రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు జారీ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం చేసిన సిఫార్సుల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్ర‌స్తుతం ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను ఛ‌త్తీస్‌గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్‌గా బ‌దిలీ చేశారు.

ఇక‌, కొత్త‌గా నియ‌మితులైన ఏపీ గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ప‌దవిలో ఉంటారు. అయితే.. మ‌ధ్య‌లోనే తొల‌గించే లేదా బ‌దిలీ చేసే అధికారం కేంద్రానికి లేదా రాష్ట్ర‌ప‌తికి ఉంటుంది. ఇక‌, ఏపీకి నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన అబ్దుల్ న‌జీర్‌.. రెండో వారు కావ‌డం గ‌మ‌నార్హం. తొలి గ‌వ‌ర్న‌ర్‌గా.. ప్ర‌స్తుతం ఉన్న విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌.. 2019 చివ‌రిలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇక‌, అబ్ధుల న‌జీర్ నేప‌థ్యం ఇదీ..

న్యాయవాదుల కుటుంబానికి చెందిన అబ్దుల్ న‌జీర్‌.. త‌న కెరీర్‌ను కూడా న్యాయ‌వాద వృత్తిపైనే న‌డిపించారు. క‌ర్ణాట‌క‌కు చెందిన ఆయ‌న‌.. అక్క‌డి హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. ప్రెమోష‌న్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారు. అనేక సంచ‌ల‌న తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా  ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్‌ ఒకరు. ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనంలోనూ జస్టిస్‌ నజీర్‌ ఉన్నారు.

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించిన ఆయన.. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది.

Satya

Recent Posts

లేబర్ అడ్డా అదిరిందండోయ్!

ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని…

2 minutes ago

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు…

1 hour ago

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

3 hours ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

4 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

5 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

5 hours ago