వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అన్నిప్రయత్నాలు చేస్తున్న టీడీపీ ఈ దిశగా తనకు ఉన్న అన్ని మార్గాలకూ పదును పెడుతోంది. ముఖ్యంగా 175 అసెంబ్లీ స్థానాల్లో 175 చోట్లా గెలుపు గుర్రం ఎక్కడంతోపాటు.. పార్లమెంటు స్థానాల్లోనూ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా 25 పార్లమెంటు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులకు అవకాశం ఇస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ 25 స్థానాల్లోనూ విజయం దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
మరీ ముఖ్యంగా విజయవాడ వంటి బలమైన స్థానాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నే ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో నారా వారి కోడలు నారా బ్రాహ్మణికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. విజయవాడ ఎంపీ స్థానంలో ఏర్పడిన తీవ్ర వివాదం. ప్రస్తుతం కేశినేని నాని.. వర్సెస్ ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ల మధ్య ఈ స్థానంపై తీవ్ర వివాదం ఏర్పడింది.
వచ్చే ఎన్నికల్లో ఈ సీటును తనకు ఇవ్వాలని శివనాథ్ పట్టుబడుతున్నారు. అదేసమయంలో నాని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.త నకు టికెట్ ఇవ్వకుండా.. తన సోదరుడికి టికెట్ ఇస్తే.. ఎలా ఓడించాలో తనకు తెలుసు అంటూ.. ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ కేడర్ కూడా శివనాథ్ వైపు మొగ్గు చూపుతోంది. అలాగని ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనికితోడు ఈ ఇద్దరు సోదరుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. వివాదాలు మరింత ముదిరి.. పార్టీకే నష్టం చేకూరుతుంది.
దీంతో ఇద్దరినీ పక్కన పెట్టి.. నారా వారి కోడలు బ్రాహ్మణికి అవకాశం ఇస్తే.. పార్లమెంటులో బలమైన గళం వినిపించే అవకాశం ఉండడంతోపాటు విద్యావంతురానికి పార్లమెంటుకు పంపించిన రికార్డును కూడా సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు తలపోస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతందీనికి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేశారని అంటున్నారు. పోటీకి బ్రాహ్మణి కూడా రెడీగా ఉన్నారని సమాచారం.
This post was last modified on February 12, 2023 11:11 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…