వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అన్నిప్రయత్నాలు చేస్తున్న టీడీపీ ఈ దిశగా తనకు ఉన్న అన్ని మార్గాలకూ పదును పెడుతోంది. ముఖ్యంగా 175 అసెంబ్లీ స్థానాల్లో 175 చోట్లా గెలుపు గుర్రం ఎక్కడంతోపాటు.. పార్లమెంటు స్థానాల్లోనూ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా 25 పార్లమెంటు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులకు అవకాశం ఇస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ 25 స్థానాల్లోనూ విజయం దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
మరీ ముఖ్యంగా విజయవాడ వంటి బలమైన స్థానాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నే ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో నారా వారి కోడలు నారా బ్రాహ్మణికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. విజయవాడ ఎంపీ స్థానంలో ఏర్పడిన తీవ్ర వివాదం. ప్రస్తుతం కేశినేని నాని.. వర్సెస్ ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ల మధ్య ఈ స్థానంపై తీవ్ర వివాదం ఏర్పడింది.
వచ్చే ఎన్నికల్లో ఈ సీటును తనకు ఇవ్వాలని శివనాథ్ పట్టుబడుతున్నారు. అదేసమయంలో నాని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.త నకు టికెట్ ఇవ్వకుండా.. తన సోదరుడికి టికెట్ ఇస్తే.. ఎలా ఓడించాలో తనకు తెలుసు అంటూ.. ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ కేడర్ కూడా శివనాథ్ వైపు మొగ్గు చూపుతోంది. అలాగని ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనికితోడు ఈ ఇద్దరు సోదరుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. వివాదాలు మరింత ముదిరి.. పార్టీకే నష్టం చేకూరుతుంది.
దీంతో ఇద్దరినీ పక్కన పెట్టి.. నారా వారి కోడలు బ్రాహ్మణికి అవకాశం ఇస్తే.. పార్లమెంటులో బలమైన గళం వినిపించే అవకాశం ఉండడంతోపాటు విద్యావంతురానికి పార్లమెంటుకు పంపించిన రికార్డును కూడా సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు తలపోస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతందీనికి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేశారని అంటున్నారు. పోటీకి బ్రాహ్మణి కూడా రెడీగా ఉన్నారని సమాచారం.
This post was last modified on February 12, 2023 11:11 am
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై…
ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం…
పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడున్నా అభిమానులు మాకు ఒకటే ఉందన్న తీరులో ఎక్కడ చూసినా ఓజి జపంతో…
ఈ మధ్య కాలంలో తమిళ టైటిల్స్ ని యధాతథంగా ఉంచేసి తెలుగులో డబ్బింగ్ చేయడం పరిపాటిగా మారింది. తలైవి, వలిమైతో…
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిషిని ఆప్ నాయక త్వం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.…
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ? అనవసరంగా అతని…