తనకు తనే సర్టిఫికెట్లు ఇచ్చుకునే నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంలో మాత్రం వారు విఫలమవుతున్నారు. ఇలాంటివారిలో మాజీ మంత్రి అఖిల ప్రియ ఒకరు. టీడీపీలో తను ఫైర్బ్రాండ్ అని ఆమె పదే పదే చెప్పుకొంటారు. కానీ, వాస్తవం ఏంటంటే.. 2014లో అమ్మ సింపతీతో విజయం దక్కించుకున్న ఆమె 2019లో చతికిల పడ్డారు. ఈ విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. పైకి మాత్రం చాలా గంభీరంగా.. నంద్యాల నాన్న.. ఆళ్లగడ్డ అమ్మ అని చెప్పుకొంటున్నారు.
ఇక, ఇటీవల కాలంలో అఖిల ప్రియ గ్రాఫ్ దారుణంగా పడిపోతున్న విషయం తెలిసిందే. ఆమె స్వయంగా చేసుకున్న కొన్ని చిక్కులకు ఆమె రాజకీయం బలి అయిపోతోంది. హైదరాబాద్లో చోటు చేసుకున్న రెండు విషయాల్లో కేసుల చిక్కుముళ్లు ఆమెను విడిచిపెట్టడం లేదు. ఒకటి స్థలం వివాదం, రెండు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడడం. వీటినుంచే ఆమె చిక్కులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు అప్పుల కుప్పలు.. ఇప్పుడు ఆమె సతమతం చేస్తున్నాయి.
ఇదిలావుంటే.. పార్టీపరంగా ఎవరైనా ఆమెకు దన్నుగా ఉన్నారా? అంటే ఎవరూ లేరు. ఎందుకంటే.. ఆమె రైవల్ ఏవీ సుబ్బారెడ్డివైపే అందరూ నిలుస్తున్నారు. ఈయన వియ్యం అందుకున్న బొండా ఉమా.. కొన్నాళ్లుగా ఆళ్లగడ్డలో చక్రం తిప్పుతున్నారు. వియ్యంకుడిని బలోపేతం చేస్తున్నారు. అంతేకాదు.. తన వియ్యంకుడు ఏవీ సుబ్బారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకునేందుకు బొండా ఉమా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి సఫలం కూడా అయ్యాయని తెలుస్తోంది.
చంద్రబాబు దగ్గర ఉన్న ఇమేజ్తో బొండా ఉమా.. ఆళ్లగడ్డలో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తానని.. సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరారని తెలిసింది. దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు ఓకే చెప్పారని అంటున్నారు. ఇప్పటికే నంద్యాల టికెట్ను శిల్పా రవికి ఇస్తున్నట్టు అఖిల ప్రియే వెల్లడించారు. ఇక, ఇప్పుడు ఆళ్లగడ్డ కూడా పోయింది. దీంతో “ఏతీరుగ నను దయచూసెదవో” అంటూ.. ఆమె చంద్రబాబు అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 11, 2023 12:52 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…