తనకు తనే సర్టిఫికెట్లు ఇచ్చుకునే నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంలో మాత్రం వారు విఫలమవుతున్నారు. ఇలాంటివారిలో మాజీ మంత్రి అఖిల ప్రియ ఒకరు. టీడీపీలో తను ఫైర్బ్రాండ్ అని ఆమె పదే పదే చెప్పుకొంటారు. కానీ, వాస్తవం ఏంటంటే.. 2014లో అమ్మ సింపతీతో విజయం దక్కించుకున్న ఆమె 2019లో చతికిల పడ్డారు. ఈ విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. పైకి మాత్రం చాలా గంభీరంగా.. నంద్యాల నాన్న.. ఆళ్లగడ్డ అమ్మ అని చెప్పుకొంటున్నారు.
ఇక, ఇటీవల కాలంలో అఖిల ప్రియ గ్రాఫ్ దారుణంగా పడిపోతున్న విషయం తెలిసిందే. ఆమె స్వయంగా చేసుకున్న కొన్ని చిక్కులకు ఆమె రాజకీయం బలి అయిపోతోంది. హైదరాబాద్లో చోటు చేసుకున్న రెండు విషయాల్లో కేసుల చిక్కుముళ్లు ఆమెను విడిచిపెట్టడం లేదు. ఒకటి స్థలం వివాదం, రెండు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడడం. వీటినుంచే ఆమె చిక్కులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు అప్పుల కుప్పలు.. ఇప్పుడు ఆమె సతమతం చేస్తున్నాయి.
ఇదిలావుంటే.. పార్టీపరంగా ఎవరైనా ఆమెకు దన్నుగా ఉన్నారా? అంటే ఎవరూ లేరు. ఎందుకంటే.. ఆమె రైవల్ ఏవీ సుబ్బారెడ్డివైపే అందరూ నిలుస్తున్నారు. ఈయన వియ్యం అందుకున్న బొండా ఉమా.. కొన్నాళ్లుగా ఆళ్లగడ్డలో చక్రం తిప్పుతున్నారు. వియ్యంకుడిని బలోపేతం చేస్తున్నారు. అంతేకాదు.. తన వియ్యంకుడు ఏవీ సుబ్బారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకునేందుకు బొండా ఉమా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి సఫలం కూడా అయ్యాయని తెలుస్తోంది.
చంద్రబాబు దగ్గర ఉన్న ఇమేజ్తో బొండా ఉమా.. ఆళ్లగడ్డలో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తానని.. సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరారని తెలిసింది. దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు ఓకే చెప్పారని అంటున్నారు. ఇప్పటికే నంద్యాల టికెట్ను శిల్పా రవికి ఇస్తున్నట్టు అఖిల ప్రియే వెల్లడించారు. ఇక, ఇప్పుడు ఆళ్లగడ్డ కూడా పోయింది. దీంతో “ఏతీరుగ నను దయచూసెదవో” అంటూ.. ఆమె చంద్రబాబు అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 11, 2023 12:52 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…