ఏపీ అధికార వైసీపీ నేతలకు.. విపక్ష వైసీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు బోలెడన్ని విషయాలు చెబుతారు. వీటన్నింటిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే.. వైసీపీ చెందిన ప్రతి నేత ఒక్కో ఆటంబాంబ్ మాదిరి ఉంటారు. వైఎస్ జగన్ అంటే వల్లమాలిన అభిమానమే కాదు.. ఆయన తమ మంత్రి పదవుల్ని తీసేసినా సరే.. విధేయతతో ఉంటారు. ప్రైవేటు సంభాషణల్లో సైతం అధినేత గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేయరు.
గుండెల్లోని బాధను చాలా కొద్దిమంది ముందు మాత్రమే చెప్పుకుంటారు. మొత్తంగా విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండటమే కాదు.. అధినేత మీద ఈగ కాదు కదా ఈగ రెక్క మందంగా వెళుతున్నా ఇష్టపడకుండా ఉండే వైనం కనిపిస్తుంది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల్ని చూసినప్పుడు.. ఇలాంటి గుణాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తాయి. అదే చంద్రబాబుకు మైనస్ కాగా.. జగన్ కు అదే ప్లస్ అవుతుంటుంది.
అంతటి విధేయతను ప్రదర్శించే నేత మనసు విరిగినప్పుడు.. సదరు వైసీపీ నాయకుడు ఎలా మారతారు? వారి మాటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తారు వైసీపీ ఎమ్మెల్యే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కారణం ఏదైనా.. తన విషయంలో అధినేత జగన్ ప్రదర్శించిన వివక్ష.. చిన్నచూపుతో పాటు మరికొన్ని కారణాలు కలిసి ఆయన మనసు విరిగింది. టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు.
ఇంతకాలం తమతో ఉండి.. ఇప్పుడు బయటకు వెళ్లే కోటంరెడ్డి మీద ఎప్పటిలానే వైసీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. దీంతో.. ఆయన తానేమిటో చూపిస్తున్నారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నేతలు.. చంద్రబాబును ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో పోలిస్తే.. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేందుకు సిద్ధమైన కోటంరెడ్డి లాంటి వారు అస్సలు మాటలే అనలేదని చెప్పాలి. అయినప్పటికీ వైసీపీ నేతల మాటల దాడితో మనసు మరింత విరిగిన కోటంరెడ్డి ఇప్పుడు మాటల ఊచకోతను మొదలు పెట్టారు.
వెనుకా ముందు చూసుకోకుండా.. తోపుల్లాలంటి వైసీపీ నేతలకు వరుస పెట్టి ఇచ్చి పడేస్తున్నారు. ఆయన మాటల ధాటి చూస్తుంటే.. ఈ తరహాలో విరుచుకుపడే సత్తా టీడీపీలో చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నట్లు అర్థమవుతుంది. గడిచిన మూడు రోజులుగా కోటంరెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనపై విమర్శలు సంధించేందుకు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటే.. తాజాగా మాట్లాడిన ఆయన ఒకే రౌండ్ లో చాలామందికి మాటలతో ఇచ్చి పడేశారు.
చంద్రబాబు ట్రాప్ లో పడిన కోటంరెడ్డి అవాస్తవాల్ని చెబుతున్నారని.. ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్. ఆయన ఒక్కరే కాదు ప్రభుత్వ సలహాదారు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామక్రిష్ణారెడ్డి, మరో మాజీ మంత్రి అనిల్ యాదవ్ ల మీద విరుచుకుపడ్డారు. కోటంరెడ్డి తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on February 4, 2023 1:57 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…