ఏపీ అధికార వైసీపీ నేతలకు.. విపక్ష వైసీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు బోలెడన్ని విషయాలు చెబుతారు. వీటన్నింటిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే.. వైసీపీ చెందిన ప్రతి నేత ఒక్కో ఆటంబాంబ్ మాదిరి ఉంటారు. వైఎస్ జగన్ అంటే వల్లమాలిన అభిమానమే కాదు.. ఆయన తమ మంత్రి పదవుల్ని తీసేసినా సరే.. విధేయతతో ఉంటారు. ప్రైవేటు సంభాషణల్లో సైతం అధినేత గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేయరు.
గుండెల్లోని బాధను చాలా కొద్దిమంది ముందు మాత్రమే చెప్పుకుంటారు. మొత్తంగా విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండటమే కాదు.. అధినేత మీద ఈగ కాదు కదా ఈగ రెక్క మందంగా వెళుతున్నా ఇష్టపడకుండా ఉండే వైనం కనిపిస్తుంది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల్ని చూసినప్పుడు.. ఇలాంటి గుణాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తాయి. అదే చంద్రబాబుకు మైనస్ కాగా.. జగన్ కు అదే ప్లస్ అవుతుంటుంది.
అంతటి విధేయతను ప్రదర్శించే నేత మనసు విరిగినప్పుడు.. సదరు వైసీపీ నాయకుడు ఎలా మారతారు? వారి మాటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తారు వైసీపీ ఎమ్మెల్యే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కారణం ఏదైనా.. తన విషయంలో అధినేత జగన్ ప్రదర్శించిన వివక్ష.. చిన్నచూపుతో పాటు మరికొన్ని కారణాలు కలిసి ఆయన మనసు విరిగింది. టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు.
ఇంతకాలం తమతో ఉండి.. ఇప్పుడు బయటకు వెళ్లే కోటంరెడ్డి మీద ఎప్పటిలానే వైసీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. దీంతో.. ఆయన తానేమిటో చూపిస్తున్నారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నేతలు.. చంద్రబాబును ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో పోలిస్తే.. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేందుకు సిద్ధమైన కోటంరెడ్డి లాంటి వారు అస్సలు మాటలే అనలేదని చెప్పాలి. అయినప్పటికీ వైసీపీ నేతల మాటల దాడితో మనసు మరింత విరిగిన కోటంరెడ్డి ఇప్పుడు మాటల ఊచకోతను మొదలు పెట్టారు.
వెనుకా ముందు చూసుకోకుండా.. తోపుల్లాలంటి వైసీపీ నేతలకు వరుస పెట్టి ఇచ్చి పడేస్తున్నారు. ఆయన మాటల ధాటి చూస్తుంటే.. ఈ తరహాలో విరుచుకుపడే సత్తా టీడీపీలో చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నట్లు అర్థమవుతుంది. గడిచిన మూడు రోజులుగా కోటంరెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనపై విమర్శలు సంధించేందుకు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటే.. తాజాగా మాట్లాడిన ఆయన ఒకే రౌండ్ లో చాలామందికి మాటలతో ఇచ్చి పడేశారు.
చంద్రబాబు ట్రాప్ లో పడిన కోటంరెడ్డి అవాస్తవాల్ని చెబుతున్నారని.. ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్. ఆయన ఒక్కరే కాదు ప్రభుత్వ సలహాదారు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామక్రిష్ణారెడ్డి, మరో మాజీ మంత్రి అనిల్ యాదవ్ ల మీద విరుచుకుపడ్డారు. కోటంరెడ్డి తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on February 4, 2023 1:57 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…