కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయ్. తన ప్రతినిధులను వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ అక్కడి నాయకులను చేర్చుుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో పార్టీ టేకాఫ్ దిశగా నాందేడ్ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంతమంది వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వైజాగ్ వెళ్లి గంటా శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీ నారాయణను కలిశారు.
వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. రోజుకు రెండు పూటల జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించిన ఆయన ఇప్పుడు తనను ఎన్ కౌంటర్ చేస్తారేమోనని టెన్షన్ పడుతున్నారు.
ఏ పార్టీలోకి రానివ్వరా..
కోటంరెడ్డి టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు సమాచారం. కాకపోతే ఆయన్ను చేర్చుకునే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన ప్రవర్తన, టీడీపీ పట్ల ఆయన ప్రవర్తించిన దూకుడును చూసి చంద్రబాబు వెనుకాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోటంరెడ్డి పట్ల నెల్లూరు జిల్లా టీడీపీ కేడర్ కూడా విముఖంగా ఉందని చెబుతున్నారు..
ఎవరూ చేర్చుకోకపోతే బీఆర్ఎస్
వైసీపీని వీడే క్రమంలో తాను కొన్ని పార్టీల వైపు చూస్తున్నానని కోటంరెడ్డి ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ఎవరూ చేర్చుకోకపోతే కొత్త పార్టీ బీఆర్ఎస్ లో చేరతానని ఆయన అన్నారు. అంటే ఆప్షన్లు చాలానే ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పారు.
ఎదురుచూస్తున్న బీఆర్ఎస్
కోటంరెడ్డి లాంటి నాయకుల కోసం బీఆర్ఎస్ ఎదురుచూస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లాలో బలమైన సామాజికవర్గం నేత. పైగా ఎన్నికల్లో ఎంతైనా వ్యయం చేసేందుకు కోటంరెడ్డి వెనుకాడరు. పది మందిని తనతో తిప్పుకుంటూ పార్టీకి బలముందని కూడా నిరూపించగలరు. మరి కేసీఆర్, కోటంరెడ్డి మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి…
This post was last modified on February 4, 2023 6:52 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…