Political News

చ‌చ్చే వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే-పోసాని

పోసాని గ‌తంలో జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీల కోసం ప‌ని చేసి 2019 ఎన్నిక‌ల‌కు కొన్నేళ్ల‌ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జ‌గ‌న్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా మారారు. వైకాపా కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేసిన పోసాని.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మూడేళ్ల‌కు పైగా ప‌ద‌వేమీ రాక‌పోయినా మౌనంగానే ఉన్నారు. ఐతే ఆలీకి ఓ ప‌ద‌వి ఇచ్చిన‌ట్లే ఇప్పుడు పోసానికి కూడా ఓ ప‌ద‌వి కేటాయించేశారు జ‌గ‌న్.

ఏపీ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే పోసానిని జ‌గ‌న్ స‌ర్కారు నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఏపీ మంత్రులు, కొంద‌రు సినీ ప్రముఖుల స‌మ‌క్షంలో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు పోసాని. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్‌ను ఆకాశానికెత్తేశారు. తాను చ‌చ్చేవ‌ర‌కు జ‌గ‌న్‌తోనే ఉంటాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

“జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగారిని మొన్న‌టిదాకా నేను ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌లేదు. ఆయ‌న ఎన్నోసార్లు న‌న్ను పిలిచారు. కానీ వెళ్ల‌లేదు. దూరం నుంచి చూసి అభిమానించేవాడిని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. చాలామంది నాయ‌కులు కులాల్లోంచి, మ‌తాల్లోంచి, డ‌బ్బులోంచి పుడ‌తారు. కానీ జ‌గ‌న్ గారు జ‌నాల్లోంచి పుట్టిన నాయ‌కుడు. అందుకే నాకు ఇష్టం. ఊపిరి పోయే వరకు సీఎం జగన్‌తోనే ఉంటా. జ‌గ‌న్ గారు హానెస్ట్, హాటెస్ట్, గ్రేటెస్ట్, న‌థింగ్ బ‌ట్ ఎవ‌రెస్ట్” అంటూ జ‌గ‌న్‌ను కొనియాడారు పోసాని.

ఇక ఏపీ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా తాను సినీ పరిశ్రమకు ఎంత మంచి చేస్తానో తెలియదు కానీ, చెడు మాత్రం చేయనని పోసాని అన్నారు. కార్పొరేష‌న్ కోసం జ‌గ‌న్ గారు నేను కోరిన‌న్ని డ‌బ్బులు ఇస్తార‌ని అనుకుంటున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

This post was last modified on February 4, 2023 6:45 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

19 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago