Political News

సీబీఐకి అవినాష్ రెడ్డి ష‌ర‌తులు..

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. దీనిలో కొన్ని ష‌ర‌తులు కూడా పెట్టారు. అది కూడా శ‌నివారం ఉద‌యం హ‌ఠాత్తుగా ఆయ‌న ఓలేఖ‌ను సీబీఐకి పంపించ‌డం ఆస‌క్తిగా మారింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న సీబీఐ ఎదుట హాజ‌రు కావాల్సిన నేప‌థ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం కూడా ఏర్ప‌డింది.

ఇంత‌కీ అవినాష్‌రెడ్డి పెట్టిన ష‌ర‌తులు ఏంటంటే.. “వివేకా హత్య కేసులో నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారు. విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. లోప‌ల ఏం జ‌రుగుతోందో.. రికార్డు తీసుకునేందుకు, వాయిస్‌, వీడియో రికార్డ‌ర్‌ల‌కు అనుమ‌తి మంజూరు చేయాలి” అని అవినాష్‌ లేఖ రాశారు.

అదేస‌మ‌యంలో తాను శ‌నివారం విచారణకు హాజరవుతున్నానని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. తాను చేసిన‌ విజ్ఞప్తులను సీబీఐ పరిగణన‌లోకి తీసుకోవాల‌ని కోరారు. కాగా, ఆది నుంచి కూడా అన్ని వేళ్లు అవినాష్ వైపే చూపుతున్నాయి. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ఉంచి వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌, వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుమార్తె ష‌ర్మిల కూడా ఎంపీ సీటు వ్య‌వ‌హారంలో వ‌చ్చిన తేడా కార‌ణంగానే వివేకా హ‌త్య‌కు గుర‌య్యారని తెలిపారు.

అంతేకాదు.. కావాల్సిన వారే ఆయ‌న‌ను దారుణంగా హ‌త్య చేయించార‌ని విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సీబీఐ సైత‌.. ఈ ఘ‌ట‌న వెనుక చాలామంది పెద్ద‌లు ఉన్నార‌ని తెలిపారు. ఇక‌, ఇప్పుడు ఎంపీఅవినాష్ రెడ్డి విచార‌ణ కూడా తెర‌మీదికి రావ‌డంతో ఈ ఘ‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

7 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

7 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

8 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

9 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

9 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

9 hours ago