Political News

సీబీఐకి అవినాష్ రెడ్డి ష‌ర‌తులు..

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. దీనిలో కొన్ని ష‌ర‌తులు కూడా పెట్టారు. అది కూడా శ‌నివారం ఉద‌యం హ‌ఠాత్తుగా ఆయ‌న ఓలేఖ‌ను సీబీఐకి పంపించ‌డం ఆస‌క్తిగా మారింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న సీబీఐ ఎదుట హాజ‌రు కావాల్సిన నేప‌థ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం కూడా ఏర్ప‌డింది.

ఇంత‌కీ అవినాష్‌రెడ్డి పెట్టిన ష‌ర‌తులు ఏంటంటే.. “వివేకా హత్య కేసులో నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారు. విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. లోప‌ల ఏం జ‌రుగుతోందో.. రికార్డు తీసుకునేందుకు, వాయిస్‌, వీడియో రికార్డ‌ర్‌ల‌కు అనుమ‌తి మంజూరు చేయాలి” అని అవినాష్‌ లేఖ రాశారు.

అదేస‌మ‌యంలో తాను శ‌నివారం విచారణకు హాజరవుతున్నానని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. తాను చేసిన‌ విజ్ఞప్తులను సీబీఐ పరిగణన‌లోకి తీసుకోవాల‌ని కోరారు. కాగా, ఆది నుంచి కూడా అన్ని వేళ్లు అవినాష్ వైపే చూపుతున్నాయి. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ఉంచి వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌, వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుమార్తె ష‌ర్మిల కూడా ఎంపీ సీటు వ్య‌వ‌హారంలో వ‌చ్చిన తేడా కార‌ణంగానే వివేకా హ‌త్య‌కు గుర‌య్యారని తెలిపారు.

అంతేకాదు.. కావాల్సిన వారే ఆయ‌న‌ను దారుణంగా హ‌త్య చేయించార‌ని విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సీబీఐ సైత‌.. ఈ ఘ‌ట‌న వెనుక చాలామంది పెద్ద‌లు ఉన్నార‌ని తెలిపారు. ఇక‌, ఇప్పుడు ఎంపీఅవినాష్ రెడ్డి విచార‌ణ కూడా తెర‌మీదికి రావ‌డంతో ఈ ఘ‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

This post was last modified on January 28, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

12 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

52 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago