మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. దీనిలో కొన్ని షరతులు కూడా పెట్టారు. అది కూడా శనివారం ఉదయం హఠాత్తుగా ఆయన ఓలేఖను సీబీఐకి పంపించడం ఆసక్తిగా మారింది. శనివారం మధ్యాహ్నం ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం కూడా ఏర్పడింది.
ఇంతకీ అవినాష్రెడ్డి పెట్టిన షరతులు ఏంటంటే.. “వివేకా హత్య కేసులో నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారు. విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. లోపల ఏం జరుగుతోందో.. రికార్డు తీసుకునేందుకు, వాయిస్, వీడియో రికార్డర్లకు అనుమతి మంజూరు చేయాలి” అని అవినాష్ లేఖ రాశారు.
అదేసమయంలో తాను శనివారం విచారణకు హాజరవుతున్నానని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తులను సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కాగా, ఆది నుంచి కూడా అన్ని వేళ్లు అవినాష్ వైపే చూపుతున్నాయి. అప్రూవర్గా మారిన దస్తగిరి ఉంచి వివేకా కుమార్తె డాక్టర్ సునీత, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కూడా ఎంపీ సీటు వ్యవహారంలో వచ్చిన తేడా కారణంగానే వివేకా హత్యకు గురయ్యారని తెలిపారు.
అంతేకాదు.. కావాల్సిన వారే ఆయనను దారుణంగా హత్య చేయించారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఐ సైత.. ఈ ఘటన వెనుక చాలామంది పెద్దలు ఉన్నారని తెలిపారు. ఇక, ఇప్పుడు ఎంపీఅవినాష్ రెడ్డి విచారణ కూడా తెరమీదికి రావడంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on January 28, 2023 3:49 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…