మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. దీనిలో కొన్ని షరతులు కూడా పెట్టారు. అది కూడా శనివారం ఉదయం హఠాత్తుగా ఆయన ఓలేఖను సీబీఐకి పంపించడం ఆసక్తిగా మారింది. శనివారం మధ్యాహ్నం ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం కూడా ఏర్పడింది.
ఇంతకీ అవినాష్రెడ్డి పెట్టిన షరతులు ఏంటంటే.. “వివేకా హత్య కేసులో నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారు. విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. లోపల ఏం జరుగుతోందో.. రికార్డు తీసుకునేందుకు, వాయిస్, వీడియో రికార్డర్లకు అనుమతి మంజూరు చేయాలి” అని అవినాష్ లేఖ రాశారు.
అదేసమయంలో తాను శనివారం విచారణకు హాజరవుతున్నానని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తులను సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కాగా, ఆది నుంచి కూడా అన్ని వేళ్లు అవినాష్ వైపే చూపుతున్నాయి. అప్రూవర్గా మారిన దస్తగిరి ఉంచి వివేకా కుమార్తె డాక్టర్ సునీత, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కూడా ఎంపీ సీటు వ్యవహారంలో వచ్చిన తేడా కారణంగానే వివేకా హత్యకు గురయ్యారని తెలిపారు.
అంతేకాదు.. కావాల్సిన వారే ఆయనను దారుణంగా హత్య చేయించారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఐ సైత.. ఈ ఘటన వెనుక చాలామంది పెద్దలు ఉన్నారని తెలిపారు. ఇక, ఇప్పుడు ఎంపీఅవినాష్ రెడ్డి విచారణ కూడా తెరమీదికి రావడంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on January 28, 2023 3:49 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…