బెజవాడలోని దుర్గమ్మ సన్నిలో పవణ్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు.
ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పయనంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉండాలని అన్నారు. గుడిలో రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసిన ఆయన రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడమే వారాహి లక్ష్యం అని మాత్రం చెప్పారు.
ఏపీలోకి తొలిసారి తీసుకొచ్చిన వారాహి వాహనం నుంచి మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్ ఏంటో అనౌన్స్ చేశారు. వారాహిని ఎందుకు సిద్ధం చేయాల్సి వచ్చిందో చెప్పారు. ఏపీలో రాక్షస పాలన అంతానికే వారాహి తెచ్చామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
అంతకు ముందు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.
పవన్ కళ్యాణ్కు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో శ్రీమతి భ్రమరాంబ, ఆలయ అధికారులు, వేద పండితులు ఆయన్ను అంతరాలయంలోంచి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు చేయించారు.
కాగా పవన్ నిన్న తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయంలో వారాహికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనూ పోటీ చేస్తామని.. 7 నుంచి 14 సీట్లకు తెలంగాణలో పోటీపడతామని చెప్పారు. ఏపీలో పొత్తులు కూడా పరిస్థితులను బట్టి మారుతాయని చెప్తూనే బీజేపీతో ఇంకా పొత్తుల్లోనే ఉన్నట్లు తెలిపారు.
అయితే.. ఏపీ విషయానికి వచ్చేసరికి ఆయన అటు బీజేపీ, ఇటు టీడీపీతో కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా బీజేపీ, టీడీపీలు కలిసే అవకాశం కనిపించకపోవడంతో ఎన్నికల నాటికి ఏపీలో పొత్తులు ఎలా ఉంటాయా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో పవన్ త్వరలో దీనిపైనా క్లారిటీ ఇస్తారన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on January 25, 2023 12:11 pm
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…