Political News

రాక్షస పాలన అంతానికే వారాహి తెచ్చాము

బెజవాడలోని దుర్గమ్మ సన్నిలో పవణ్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు.

ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పయనంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉండాలని అన్నారు. గుడిలో రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసిన ఆయన రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడమే వారాహి లక్ష్యం అని మాత్రం చెప్పారు.

ఏపీలోకి తొలిసారి తీసుకొచ్చిన వారాహి వాహనం నుంచి మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్ ఏంటో అనౌన్స్ చేశారు. వారాహిని ఎందుకు సిద్ధం చేయాల్సి వచ్చిందో చెప్పారు. ఏపీలో రాక్షస పాలన అంతానికే వారాహి తెచ్చామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

అంతకు ముందు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.

పవన్ కళ్యాణ్‌కు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో శ్రీమతి భ్రమరాంబ, ఆలయ అధికారులు, వేద పండితులు ఆయన్ను అంతరాలయంలోంచి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు చేయించారు.

కాగా పవన్ నిన్న తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయంలో వారాహికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనూ పోటీ చేస్తామని.. 7 నుంచి 14 సీట్లకు తెలంగాణలో పోటీపడతామని చెప్పారు. ఏపీలో పొత్తులు కూడా పరిస్థితులను బట్టి మారుతాయని చెప్తూనే బీజేపీతో ఇంకా పొత్తుల్లోనే ఉన్నట్లు తెలిపారు.

అయితే.. ఏపీ విషయానికి వచ్చేసరికి ఆయన అటు బీజేపీ, ఇటు టీడీపీతో కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా బీజేపీ, టీడీపీలు కలిసే అవకాశం కనిపించకపోవడంతో ఎన్నికల నాటికి ఏపీలో పొత్తులు ఎలా ఉంటాయా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో పవన్ త్వరలో దీనిపైనా క్లారిటీ ఇస్తారన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on January 25, 2023 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago